Home / latest sports news
Ashwin: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అరుదైన మైలురాయికి అడుగు దూరంలో ఉన్నాడు. మరో ఒక్క వికెట్ తీస్తే.. రికార్డుల్లోకి ఎక్కనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో.. 449 వికెట్లు పడగొట్టాడు. మెుత్తం ఇప్పటివరకు 88 మ్యాచులు ఆడిన అశ్విన్.. 449 వికెట్లతో మరో రికార్డుకు దగ్గరయ్యాడు.
Indian cricketers: భారత్ క్రికెటర్లు.. మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యారు. కొందరు నెటిజన్లు.. వీరిని టార్గెట్ గా చేసుకోని ఘోరంగా ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ కు కారణం ఉందంటూ సోషల్ మీడియాలో ఆరోపిస్తున్నారు.
Ashwin: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ గా అవతరించేందుకు ఆసీసీ నానా తంటాలు పడుతుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన ఆ జట్టు.. ప్రతిష్టాత్మక టైటిల్ గెలిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇక ఫైనల్ టెస్ట్ మ్యాచ్ కంటే ముందు.. భారత్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. భారత గడ్డపై ఈ సిరీస్ ఉండటంతో.. కంగారులు కొత్త ప్రయత్నానికి తెరతీశారు.
Hanuma Vihari: తెలుగు క్రికెటర్ హనుమ విహారి పట్టుదల ప్రదర్శించాడు. జట్టు కోసం గాయాన్నైనా లెక్క చేయకుండా పోరాటం చేశాడు. ఓ వేగమైన బంతికి హనుమ విహారి మణికట్టు విరిగింది. అయిన జట్టు కోసం అతడు బ్యాటింగ్ చేసిన తీరును క్రికెట్ అభిమానులు మెచ్చుకుంటున్నారు.
Shubman Gill: న్యూజిలాండ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. ఈ మ్యాచ్ లో చరిత్ర సృష్టించింది. మరోపైవు ఈ మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా.. చెలరేగిన శుభ్ మన్ గిల్ విరాట్ కోహ్లీ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.
IND vs NZ 3rd T20: భారత్ - న్యూజిలాండ్ మధ్య కీలక పోరుకు సిద్ధమైంది. గడిచిన రెండు టీ20ల్లో చెరో మ్యాచ్ గెలవగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని రెండు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ కీలక పోరుకు.. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం వేదికగా మారింది. చివరి పోరులో భారస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
2nd T20: లక్నో వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత బౌలర్లు చెలరేగుతున్నారు. బౌలర్ల ధాటికి కివీస్ బ్యాట్స్ మెన్ బెంబేలెత్తారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. వరుస వికెట్లు కోల్పోయింది. ఇక మెుదటి మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ ను సమం చేయాలని చూస్తోంది.
Under 19 Womens: అండర్- 19 మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొట్టతొలి అండర్ -19 ప్రపంచకప్ ను టీమిండియా కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాలో జరుగుతున్న తొలి అండర్-19 మహిళల ప్రపంచ కప్ ను భారత్ గెలుచుకుంది.
IND Vs NZ 2nd T20: మెుదటి టీ20లో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. వన్డే సిరీస్ తర్వాత ఉత్సాహంతో బరిలోకి దిగిన టీమిండియాకు పరాభవం ఎదురైంది. మెుదటి టీ20లో బౌలర్లు, బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ సిరీస్ పై ఆశలు నిలుపుకోవాలంటే.. భారత్ ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంటుంది. ఒకవేళా ఒడితే మాత్రం సిరీస్ ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంటుంది.
IND vs NZ 1st t20: మెుదటి టి20లో టీమిండియా బోల్తా పడింది. కివీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తయడంతో భారత్ ఓటమిని మూటగట్టుకుంది. అంతకుముందు బౌలింగ్ లో కూడా విఫలమైంది. కివీస్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేస్తారనుకుంటే.. చివర్లో అర్షదీప్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.