KCR Meets Hareesh Rao: కేసీఆర్ తో హరీశ్ రావు భేటీ.. కాళేశ్వరం నోటీసులపైనే చర్చ..!
KCR Meets Hareesh Rao on Kaleswaram Notice: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తాజాగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో వీరిద్దరూ భేటీ అయ్యారు. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ జారీచేసిన నోటీసుల గురించి ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్.. విచారణకు రావాలని కేసీఆర్, హరీశ్ రావు, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 15 రోజుల్లో కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, హరీశ్ రావు ఈ నెల 22న భేటీ అయ్యారు. నోటీసులతో జరిగే పరిణామాలపై చర్చించారు. కమిషన్ ముందు హాజరు కావాలా లేదా చట్టపరంగా ముందుకు వెళ్లాలా అనే అంశాలపై చర్చించారు. అలాగే ఈ విషయంలో ఎలాంటి న్యాయసలహాలు తీసుకోవాలో సమాలోచనలు జరిపారని తెలిసిందే. అయితే తాజాగా నేడు హరీశ్ రావు, కేసీఆర్ భేటీ జరిగింది. నేటి సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం నోటీసులు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు చర్యలపై కూడా మాట్లాడుకున్నట్టు సమాచారం. అయితే వీరిద్దరూ మరోసారి పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల్లో ఆసక్తి నెలకొంది.