Published On:

IPL 2025: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు?

IPL 2025: నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా.. గెలిస్తే ప్లే ఆఫ్స్ ఆశలు?

Rajasthan Royals vs Punjab Kings and Delhi Capitals vs Gujarat Titans in IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు రెండు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ జైపూర్ వేదికగా మధ్యాహ్నం 3.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇందులో రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ నుంచి ఇప్పటికే నిష్క్రమించగా.. పంజాబ్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై పంజాబ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది. దీంతో పంజాబ్‌కు ఈ మ్యాచ్ కీలకం కానుంది.

 

అలాగే, రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఢిల్లీ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌పై ఢిల్లీ ఓటమి చెందితే ప్లే ఆఫ్స్ ఆశలు సంక్లిష్టంగా మారుతాయి. ఒకవేళ గుజరాత్ గెలిస్తే.. ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా నిలువనుంది.

 

ఈ సీజన్‌లో ఇప్పటికే రాజస్థాన్ ప్లే ఆఫ్స్ నుంచి నిష్క్రమించగా.. పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ జట్లు ప్లే ఆఫ్స్ వెళ్లేందుకు అవకాశం ఉంది. అయితే నేడు జరిగే మ్యాచ్‌లలో రాజస్థాన్‌పై పంజాబ్, ఢిల్లీపై గుజరాత్ గెలిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా పంజాబ్, గుజరాత్‌తో పాటు ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లనున్నాయి. ఒకవేళ పంజాబ్, ఢిల్లీ గెలిస్తే ఏ జట్టూ కూడా ప్లే ఆఫ్స్ చేరేందుకు అవకాశం ఉండదు. ఇక, రాజస్థాన్, గుజరాత్ గెలిస్తే ఆర్సీబీతో పాటు గుజరాత్ కూడా ప్లే ఆఫ్స్ చేరుకుంటాయి. పంజాబ్‌పై రాజస్థాన్ గెలిస్తే బెంగళూరు మాత్రమే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటాయి.