Published On:

IPL 2025: సుదర్శన్ సెంచరీ.. ఢిల్లీపై గుజరాత్ విక్టరీ!

IPL 2025: సుదర్శన్ సెంచరీ.. ఢిల్లీపై గుజరాత్ విక్టరీ!

Gujarat Titans won by 10 wickets against Delhi: ఐపీఎల్ 2025లో భాగంగా ఢిల్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఢిల్లీపై 10 వికెట్ల తేడాతో గెలుపొంది ప్లే ఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 112 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, సాయికిశోర్ తలో వికెట్ తీశారు.

 

200 పరుగుల భారీ లక్ష్యఛేదనను గుజరాత్ వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. ఓపెనర్లు సాయి సుదర్శన్(108), గిల్(93) పరుగులు చేశారు. దీంతో ఢిల్లీపై గుజరాత్ సులువుగా గెలుపొందింది. దీంతో గుజరాత్ ఈ సీజన్‌లో 12 మ్యాచ్‌లు ఆడగా.. 9 గెలుపొందింది. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో నంబర్ వన్ స్థానం దక్కింది.