Published On:

Delhi: ఢిల్లీలో అక్రమ కట్టడాల కూల్చివేత.. మాజీ సీఎం విమర్శలు

Delhi: ఢిల్లీలో అక్రమ కట్టడాల కూల్చివేత.. మాజీ సీఎం విమర్శలు

Atishi Marlena: దేశ రాజధాని ఢిల్లీలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. ఆప్ సీనియర్ నేత, మాజీ సీఎం అతిశి నియోజకవర్గమైన కల్కాజీలోని గోవింద్ పురి జుగ్గి క్లస్టర్ లో అక్రమంగా నిర్మించిన 1200కు పైగా గుడిసెలను ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు కూల్చివేశారు. కాగా ప్రభుత్వ తీరుపై ఆప్ నేతలు ధ్వజమెత్తారు. బీజేపీ పేదల వ్యతిరేక ప్రభుత్వమని మాజీ సీఎం అతిశి ఆరోపించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు కూల్చివేసినట్టు డీడీఏ తెలిపింది. కాగా మాజీ సీఎం అతిశి చేసిన ఆరోపణలను మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా ఖండించారు. ఆప్ అబద్దాలను వ్యాప్తి చేస్తోందని.. ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని తిప్పికొట్టారు. అందరికీ పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కల్కాజీ, కల్కాజీ ఎక్స్ టెన్షన్ మధ్య ఉన్న గోవింద్ పురి జుగ్గి క్లస్టర్ లో 1200కు పైగా గుడిసెలు ఉన్నాయి. ఇక్కడ నివసించేవారిలో ఎక్కువ మంది రోజువారీ కూలీలే ఉన్నారు. వీరంతా చాలా ఏళ్లుగా ఇక్కడ నివరిస్తున్నారని డీడీఏ తెలిపింది. వీరందరికీ ఫ్లాట్ లు ఇవ్వబడతాయని, రేషన్ కార్డులు లేని 1200 కుటుంబాల పునరావాసానికి అర్హులు కాదని అధికారులు పేర్కొన్నారు. కానీ ప్రజలకు 3 రోజుల ముందుగానే నోటీసులు ఇచ్చినట్టు తెలిపింది. ఢిల్లీలో ఎన్నికలకు ముందు మురికివాడల్లో నివసిస్తున్న పట్టణ పేదలకు కాంక్రీటుతో నిర్మించిన ఇళ్లు అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అర్హులైన పేదలకు ఇళ్లు ఇస్తామని వెల్లడించారు.