Last Updated:

Vande Bharat: త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్

త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జమ్మూ కాశ్మీర్‌లో నడుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.ఉధమ్‌పూర్-శ్రీనగర్-బారాముల్లా (యుఎస్‌బిఆర్‌ఎల్) రైలు లింక్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రైలును నడిపిస్తామని అన్నారు

Vande Bharat: త్వరలో జమ్మూ కాశ్మీర్‌లో పరుగులు పెట్టనున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat: త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ జమ్మూ కాశ్మీర్‌లో నడుస్తుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు.ఉధమ్‌పూర్-శ్రీనగర్-బారాముల్లా (యుఎస్‌బిఆర్‌ఎల్) రైలు లింక్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ రైలును నడిపిస్తామని అన్నారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సజావుగా సాగేందుకు జమ్మూ కాశ్మీర్‌లోని బద్గామ్‌లో నిర్వహణ సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని వైష్ణవ్ తెలిపారు.

కాశ్మీర్ ను దేశంతో కలుపుతుంది..(Vande Bharat Express in Jammu And Kashmir)

చీనాబ్ నది వంతెనపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ 2023 లేదా జనవరి 2024 నాటికి సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.USBRL ప్రాజెక్ట్ కాశ్మీర్ లోయను దేశంలోని ఇతర ప్రాంతాలకు కలుపుతుంది. దాదాపు రూ. 1,400 కోట్లతో నిర్మించబడిన చీనాబ్ రైలు వంతెన ఇటీవలి చరిత్రలో భారతదేశంలోని ఏ రైల్వే ప్రాజెక్ట్‌కైనా ఎదురయ్యే అతిపెద్ద సివిల్ ఇంజనీరింగ్ సవాలు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సింగిల్ ఆర్చ్ రైల్వే వంతెనను ఈ ఏడాది ఆగస్టు 13న ప్రారంభించారు. వంతెన నిర్మాణం 2004లో మంజూరు చేయబడింది, కానీ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆలస్యమైంది.

టెక్లా అనే సాఫ్ట్‌వేర్ రూపొందించిన ఈ వంతెన మైనస్ 10 డిగ్రీల సెల్సియస్ నుండి 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకోగల హై-గ్రేడ్ స్ట్రక్చరల్ స్టీల్‌ను కలిగి ఉంది.అధిక-వేగంతో కూడిన గాలుల పరీక్ష, విపరీత ఉష్ణోగ్రతల పరీక్ష, భూకంపాలకు గురయ్యే పరీక్ష మరియు నీటి మట్టం పెరగడం వల్ల ఏర్పడే జలసంబంధమైన ప్రభావాలు వంటి అనేక భద్రతా తనిఖీలు ఇప్పటివరకు నిర్వహించబడ్డాయి.మంత్రి వైష్ణవ్ శనివారం వంతెనను పరిశీలించారు మరియు మోటారు ట్రాలీ మరియు బొలెరో కస్టమైజ్డ్ రైల్ ఆపరేషన్‌ మరో రెండు పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన ఇంజినీరింగ్ అద్భుతమని కొనియాడారు. చీనాబ్ వంతెన పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

భారతీయ రైల్వేతో ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాదిలో 22 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తయారు చేయనున్నట్లు టాటా స్టీల్ ప్రకటించింది. రైల్వే మంత్రిత్వ శాఖ రాబోయే రెండేళ్లలో 200 వందే భారత్ రైళ్ల ఉత్పత్తి లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికోసం భారతీయ రైల్వే ఇటీవల టాటా స్టీల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది, దీని కింద కంపెనీ దేశంలోనే అత్యంత వేగవంతమైన మ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ యొక్క రైళ్లను తయారు చేస్తుంది. రైల్వే మంత్రిత్వ శాఖ 2024 మొదటి త్రైమాసికం నాటికి వందే భారత్ మొదటి స్లీపర్ వెర్షన్‌ను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.