Ukraine Attack in Russia:రష్యా లోపలికి చొచ్చుకొని ఉక్రెయిన్ వెబ్ డ్రోన్ దాడులు.. భారత్ తెలుసుకోవాల్సిన 5 అంశాలు ఇవే!

What India learn from Ukraine Spider Web Drone Strike on Russia: ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్స్ వెబ్ ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు మాత్రమే ఉపయోగిస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో రష్యా ఎయిర్ బేస్లపై ఉక్రెయిన్ ఊహించని విధంగా దాడులకు దిగింది.
ఈ ఆపరేషన్లో భాగంగా రష్యాలోని భూభాగంలోకి ఉక్రెయిన్ డ్రోన్లు చొచ్చుకొని పోయి దాడికి పాల్పడ్డాయి. మొత్తం రష్యాకు చెందిన 40 యుద్ధ విమానాలను ధ్వంసం చేశాయి. దీంతో దాదాపు 60వేల కోట్ల నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. కాగా, రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022 నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది.
రష్యాపై ఉక్రెయిన్ చేపట్టిన ఈ ఆపరేషన్ భారత్ను అప్రమత్తం చేసింది. పాకిస్థాన్పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ జరిగిన 10 రోజుల వ్యవధిలో ఈ ఘటన జరిగింది. ఉక్రెయిన్ చేపట్టిన వెబ్ డ్రోన్ నుంచి భారత్ పలు విషయాలను తెలుసుకోవాల్సి ఉంది.
భవిష్యత్తులో సైనిక చర్యలకు సంబంధించి డ్రోన్లు చాలా అవసరం ఉంది. డ్రోన్లను పెంచడంతో పాటు యుద్ధంలో ఈ ప్రభావం ఎక్కువగా ఎఫెక్ట్ కానుంది. స్పైడర్ వెబ్ దాడులు లేదా మానవరహిత వైమానిక వాహనాలు అనేవి భవిష్యత్లో యుద్ధంపై మరింత ప్రభావం చూపనున్నాయి. ఇవి శత్రు దేశాల్లో చొచ్చుకొని పోయి దాడి చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా పైలట్స్ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండదు.
ఇప్పటివరకు భారత్ హెలికాప్టర్లు, ఫైలర్ జెట్స్, వైమానిక రవాణాలో విపరీతమైన కృషి చేసింది. అయితే ఉక్రెయిన్ స్పైడర్ వెబ్ భవిష్యత్తులో వైమానికి శక్తి మానవరహిత ఏఐ శక్తి ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్లో కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సి ఉంటుంది. ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ భారత్ స్వదేశీ డ్రోన్లు, సాయుధ యూఏవీలు, ఆయుధ వ్యవస్థలపై మరింత ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ వైమానిక రక్షణ అద్భుతంగా పనిచేసింది. అయితే మరింత లక్ష్యాలను చేరలేకపోయాయి. ఎందుకంటే ఉక్రెయిన్ చేపట్టిన డ్రోన్ దాడి అత్యంత సురక్షితమైన, ఖచ్చితమైన శత్రు స్థావరాలను చురుకుగా పనిచేస్తాయి. ఈ నేపథ్యంలో మరింత చొచ్చుకుపోయి దాడి చేసేందుకు స్పైడర్ వెబ్ ఒక టెంప్లేట్లా దూసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఇక, భారత్కు ఆయుధాలు, భూమిపై ఉన్నటువంటి ఎయిర్ ఫ్రేమ్లను గుర్తించి నిలిపివేసే ఏఐ గైడెడ్ డ్రోన్లతో పాటు అత్యధిక దూరం దాడి చేసే ప్లాట్ఫారమ్స్ అవసరం ఉంది.
అంతేకాకుండా, రష్యాపై ఉక్రెయిన్ చేసిన దాడి ప్రభావం సరికొత్త ఆలోచనలు రేపింది. భారత్ కొత్త మిషన్లు, వ్యూహాలపై ఆలోచించే విధానంపై ప్రభావం చూపింది. ముఖ్యంగా స్వార్మ్ డ్రోన్లు, స్టెల్త్ యూఏవీలు, ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ పేలోడ్లు, సూసైడ్ డ్రోన్లు, అటానమస్ డీప్ స్ట్రైక్ సిస్టమ్లపై ఆసక్తి, పెట్టుబడి పెంచుతుందని భావిస్తున్నారు.