Published On:

Bengaluru Stampede : కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణం : బీజేపీ

Bengaluru Stampede : కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యమే తొక్కిసలాటకు కారణం : బీజేపీ

Bengaluru : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా కర్ణాటక ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అంటూ బీజేపీ ఆరోపించింది.

 

ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. సరైన ప్రణాళిక లేకుండా కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు. అందుకే ప్రమాదం జరిగిందన్నారు. దీనికి కాంగ్రెస్‌ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆరోపించింది. ఆర్సీబీ విజయోత్సవ కార్యక్రమం సందర్భంగా అధిక సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి చేరుకున్నారు.

 

స్టేడియంలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా గేటు-2 నుంచి దూసుకెళ్లారు. అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఒక్కసారిగా తోపులాట జరగడంతో పెను ప్రమాదం జరిగింది. తొక్కిసలాటలో 10 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడ్డారు.

ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒక్కో మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ప్రకటించారు. తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి: