India vs Pakistan: పాక్ సైన్యానివి తప్పుడు ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన భారత్

Ind vs Pak: పాకిస్థాన్లోని శనివారం జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక ఇండియా హస్తం ఉందని పాక్ సైన్యం చేసిన ఆరోపణలను భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. దాడితో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది. దాడి వెనుక తమ హస్తం ఉందంటూ పాక్ సైన్యం చేస్తున్నవి పూర్తిగా తప్పుడు ఆరోపణలని పేర్కొంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.
పాకిస్థాన్లోని ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్లో శనివారం ఆత్మాహుతి దాడి జరిగిందని, దాడి నేపథ్యంలో భారత్పై నిందలు వేస్తూ పాక్ సైన్యం చేసిన అధికారిక ప్రకటన తమ దృష్టికి వచ్చిందని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ సైన్యం ప్రకటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టంచేసింది.
పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో ఓ ఉగ్రవాది ఆర్మీ కాన్వాయ్పైకి దూసుకెళ్లాడు. దీంతో వాహనంలో భారీపేలుడు సంభవించింది. పేలుడులో 13 మంది పాకిస్థాన్ సైనికులు అక్కడికక్కడే మృతిచెందారు. పౌరులు, ప్రభుత్వాధికారులు కలిపి మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఇదిలా ఉంటే, పాక్లోని తాలిబన్ హఫీజ్ గుల్ బహదూర్ గ్రూపునకు చెందిన ఉసూద్-అల్-హర్బ్ పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది.