Chhattisgarh : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. అగ్రనేత సుధాకర్ మృతి

Chhattisgarh : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతిచెందారు. ఆయన సొంతగ్రామం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సుధాకర్పై రూ.50లక్షల రివార్డు ఉంది. 40ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. సుధాకర్ అలియాస్ సింహాచలం బీజాపూర్ జాతీయపార్కు వద్ద గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు.
ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో దాడులు చేస్తోంది. తమతో చర్చలు జరపాలనే మావోయిస్టు పార్టీ ఇదివరకే విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హిడ్మాను ఇటీవల పోలీసులు అరెస్టు చేయగా, తాజాగా మావోయిస్టు అగ్రనేత సుధాకర్ మృతిచెందడం ఆ పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది.
వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్రం అనేక ఆపరేషన్లు నిర్వహిస్తోంది. ఇందులో ఆపరేషన్ కగార్ ఒకటి. ఇది గతేడాది నుంచి ఊపందుకుంది. ఆపరేషన్ అనేక మంది మావోయిస్టుల కీలక నేతలు హతమయ్యారు. దేశ వ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తన చర్యలను ముమ్మరం చేసింది.
మావోయిస్టులపై కేంద్ర చేపడుతున్న చర్యలకు నిరసనగా జూన్ 10న భారత్ బంద్కు మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. జులై 11 నుంచి ఆగస్టు 3 వరకు అమరుల స్మారక సభలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అభయ్ పేరుతో ఓ లేఖ విడుదల చేసింది.