Home / Chhattisgarh
Prime Minister Modi with Chief Ministers of 4 states Pragati Agenda Meeting: ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ 4 రాష్ట్రాల సీఎంలతో ప్రగతి ఎజెండా సమావేశం కానున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రగతి ఎజెండా సమావేశం నిర్వహించనున్నారు. ఈ ప్రగతి ఎజెండా సమావేశం భాగంగా ఆయా రాష్ట్రాల్లోని […]
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో కొన్నిరోజులుగా కాల్పుల మోతతో దద్దరిల్లుతోంది. బీజాపుర్ జిల్లాలోని నేషనల్ పార్కులో ఆపరేషన్ జరుగుతోంది. మూడోరోజూ జరిగిన ఆపరేషన్లో మరో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఘటనాస్థలిలో 2 ఏకే 47 రైఫిళ్లు, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీహైడ్రేషన్, పాముకాటు, తేనెటీగలు దాడి చేయగా, కొందరు జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. గాలింపు సందర్భంగా మరికొందరు జవాన్లకు గాయాలయ్యాయి. మూడు రోజులుగా నేషనల్ […]
Two Maoists killed in Bijapur -Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టు అగ్ర కామాండర్లు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే వీరి వివరాలు తెలియరాలేదు. ఘటనాస్థలంలో […]
Chhattisgarh : బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. శుక్రవారం జిల్లాలోని నేషనల్ పార్కు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భద్రతా బలగాలు, మావోయిస్టులకు భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా బండి ప్రకాశ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన బండి ప్రకాశ్ సింగరేణి కార్మిక సమాఖ్య ఇన్చార్జిగా పనిచేశారు. గురువారం బీజాపూర్ జిల్లాలో జరిగిన […]
Chhattisgarh : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతిచెందారు. ఆయన సొంతగ్రామం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం. సుధాకర్పై రూ.50లక్షల రివార్డు ఉంది. 40ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు. సుధాకర్ అలియాస్ సింహాచలం బీజాపూర్ జాతీయపార్కు వద్ద గురువారం జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందినట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నారు. ఇందులో భాగంగా ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో మావోయిస్టు […]
Maoist Conspiracy: ఛత్తీష్ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేసాయి. భద్రతాబలగాలే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులు అమర్చగా.. వాటిని భద్రతా బలగాలు గుర్తించి నిర్వీర్యం చేశారు. కోహిమేటా పోలీస్ స్టేషన్ పరిధిలో కోడ్ఫర్-గుర్మా అటవీ ప్రాంత రహదారిలో మావోయిస్టులు బాంబులు అమర్చారు. అయితే మావోలు అమర్చిన 10 ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించి, నిర్వీర్యం చేశారు. కోడ్ఫర్-గుర్మా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్న […]
Another setback for the Maoist Party : మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్కౌంటర్ ఘటన మరువక ముందే మరో కీలక నేతను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని జనగూడకు చెందిన కుంజాం హిడ్మాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు, డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ బృందాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బోయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెటగూడ సమీపంలోని […]
Prime Minister Narendra Modi : ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో 27 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఎన్కౌంటర్పై ప్రధాని మోదీ తాజాగా ఎక్స్ వేదికగా స్పందించారు. ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాలను ప్రశంసించారు. మీ అద్భుత విజయాన్ని చూసి గర్విస్తున్నానని కొనియాడారు. మావోయిజం ముప్పును నిర్మూలించి.. ప్రజలకు శాంతి, పురోగతితో కూడిన జీవితాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన పోస్టును మోదీ రీపోస్టు […]
Maoist leader Nambala Keshava Rao alias basavaraju died in Massive Encounter: ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హతమయ్యాడు. ఉదయం నుంచి జరుగుతున్న ఈ ఎదురుకాల్పుల్లో కీలన నేత హతమైనట్లు తెలుస్తోంది. అబుజ్మద్లో ఉన్న బటైల్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతల గుంపు ఉండగా.. మావోయిస్టు అగ్రనేత మరణించినట్లు తెలుస్తోంది. బస్తర్లోని నాలు జిల్లాల నుంచి ఉమ్మడి భద్రతా బలగాలు పాల్గొన్నట్లు నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ తెలిపారు. ఇందులో […]
20 Maoists Killed in Chhattisgarh Encounter: ఛత్తీస్గఢ్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసులు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యరు. ఈ మేరకు 28 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎదురుకాల్పులు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. నారాయణపూర్లోని మాధ్ ప్రాంతంలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం అందింది. దీంతో వెంటనే భద్రతా బలగాలు రంగంలోకి దిగి ఆపరేషన్ చేపట్టింది. ఇందులో 28 మంది […]