Last Updated:

Mohan Bhagwat: ఢిల్లీలోని మసీదును సందర్శించిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని మసీదును సందర్శించి దాని ప్రధాన మతపెద్దలతో సమావేశమయ్యారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన మతగురువు ఉమర్ అహ్మద్ ఇలియాసిని ఢిల్లీ మసీదులో కలిశారు.

Mohan Bhagwat: ఢిల్లీలోని మసీదును సందర్శించిన ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

Delhi: ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఢిల్లీలోని మసీదును సందర్శించి దాని ప్రధాన మతపెద్దలతో సమావేశమయ్యారు. ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన మతగురువు ఉమర్ అహ్మద్ ఇలియాసిని ఢిల్లీ మసీదులో కలిశారు. ఈ సందర్బంగా ఇల్యాసి శ్రీ భగవత్‌ను “రాష్ట్ర పిత” అని పిలిచారు. వీరి సమావేశం గంటకు పైగా కొనసాగింది. ఇది దేశానికి చాలా మంచి సందేశాన్ని పంపుతుంది. మేము ఒక కుటుంబంలా చర్చలు జరిపాము. వారు మా ఆహ్వానం పై రావడం చాలా అద్భుతంగా ఉంది” అని మత గురువు కుమారుడు సుహైబ్ ఇలియాసి అన్నారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మదర్సాను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు.

ఆగస్టు 22న, భగవత్ ఐదుగురు ముస్లిం మేధావులతో సమావేశమయ్యారు. దేశంలో “ప్రస్తుత సామరస్య వాతావరణం” గురించి తన అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిసింది. ప్రతి ఒక్కరూ వారి అభ్యంతరాల పై చర్చించారు. 75 నిమిషాల ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఖురైషీ మాట్లాడుతూ, దేశంలోని పరిస్థితి గురించి తాను కూడా ఆందోళన చెందుతున్నానని భగవత్ అన్నారని తెలిపారు. అసమ్మతి వాతావరణంతో నేను సంతోషంగా లేను. ఇది పూర్తిగా తప్పు. సహకారం మరియు ఐక్యతతో మాత్రమే దేశం ముందుకు సాగుతుంది” అని భగవత్ పేర్కొన్నారని అన్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఇటీవల ముస్లిం మేధావులతో సమావేశమై మత సామరస్యాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నించారని తెలిసింది. వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు సముదాయంలోని ఒక మందిరంలో హిందూ ప్రార్థనలను అభ్యర్ధించిన పిటిషన్ నేపథ్యంలో, “ప్రతి మసీదు కింద ఒక శివలింగాన్ని వెతకాలి” అని భగవత్ చేసిన ప్రకటన యొక్క ఆవశ్యకతను ప్రశ్నిస్తూ ముస్లిం ప్రతినిధుల బృందం ఈ సమావేశాన్ని కోరింది.

 

ఇవి కూడా చదవండి: