Last Updated:

Revanth Reddy : ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. మంత్రివర్గ విస్తరణపై చర్చ

Revanth Reddy : ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ నేతలు.. మంత్రివర్గ విస్తరణపై చర్చ

Revanth Reddy : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొద్దిసేపటి క్రితం ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో కాంగ్రెస్ అధిష్ఠానంతో భేటీ కానున్నారు. ఢిల్లీలోని ఇందిరాభవన్‌లో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణపై చర్చ జరగనున్నట్టు సమాచారం. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలయ్యాయి, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి వంటి విషయాలతోపాటు ఉగాది పండుగ లోపు మంత్రి వర్గ విస్తరణ చేసేందుకు ప్రధానంగా చర్చించనున్నారు.

 

 

ఉగాది పండుగ లోపు మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. మంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రెడ్డి కేటగిరీలుగా భర్తీ చేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్సీ కోటాలో జి.వివేక్, రెడ్డిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మైనార్టీ కోటాలో అమర్ అలీఖాన్, బీసీ కోటాలో వాకాటి శ్రీహరి, ఆది శ్రీనివాస్‌తోపాటు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: