Last Updated:

Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ తీవ్రవాద బాధితులకు వైద్య కోర్సుల్లో రిజర్వేషన్

జమ్ము కశ్మీర్‌లోని మెడికల్ కోర్సులలో తీవ్రవాద బాధితుల కోసం రిజర్వేషన్ పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్రం నుండి ఉగ్రవాద బాధితుల పిల్లలకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో సీట్లు కేటాయించబడతాయి.

Jammu and Kashmir: జమ్ము కశ్మీర్ తీవ్రవాద బాధితులకు వైద్య కోర్సుల్లో రిజర్వేషన్

Jammu Kashmir: జమ్ము కశ్మీర్‌లోని మెడికల్ కోర్సులలో తీవ్రవాద బాధితుల కోసం రిజర్వేషన్ పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్రం నుండి ఉగ్రవాద బాధితుల పిల్లలకు ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో సీట్లు కేటాయించబడతాయి. దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన లేదా ఉగ్రవాదుల చేతిలో దారుణంగా హతమైన వారిని గౌరవించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర హోం శాఖ యొక్క అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ రిజర్వేషన్ కు ప్రాధాన్యత ఈ విధంగా ఉంటుంది.

ఉగ్రవాదుల దాడిలో తల్లిదండ్రులు ఇరువురినీ కోల్పోయిన వారు కుటుంబానికి జీవనాధారంగా ఉన్నవారని కోల్పోయిన వారు తీవ్రవాద కార్యకలాపాల వల్ల శాశ్వత వైకల్యం మరియు తీవ్రమైన గాయాలు కలిగిన బాధితుల పిల్లలు ఈ రిజర్వేషన్ పొందడానికి అర్హులు.

అభ్యర్దులు జమ్ము కశ్మీర్ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతంలో శాశ్వత నివాసితులుగా ఉండాలి. రాష్ట్ర/యుటి ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రం/యుటికి డిప్యూటేషన్‌పై కేంద్ర/ఇతర రాష్ట్రాలు/యుటి ప్రభుత్వ ఉద్యోగులు,కేంద్ర/ఇతర రాష్ట్రాలు/యుటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు సంబంధిత రాష్ట్రం/యుటిలో తమ ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉండాలి.

ఇవి కూడా చదవండి: