Published On:

Uttam : కాంగ్రెస్ నేతలను దేశ ద్రోహులన్నారు.. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Uttam : కాంగ్రెస్ నేతలను దేశ ద్రోహులన్నారు.. మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

Minister Uttam Kumar Reddy’s harsh comments : పాక్‌తో జరిగిన యుద్ధంలో రఫెల్ యుద్ధ విమానాలు ఏమైనా కూలిపోయాయా? అని తాము అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ మంత్రి సరైన సమాధానం చెప్పలేదని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆపరేషన్ సిందూర్ రఫెల్ యుద్ధ విమానం కూలిపోయిందని సీడీఎస్ అనిల్ చౌహన్ స్పష్టం చేశారని, దీనిపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ఇకనైనా కేంద్రం దీన్ని నిరాకరించడం మానుకోవాలని సూచించారు.

 

ఇదే విషయాన్ని రాహుల్ గాంధీ మొదటి నుంచి అడుగుతున్నారని పేర్కొన్నారు. కాల్పుల విరమణ అంశానికి సంబంధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలా ట్వీట్ చేస్తారని ప్రశ్నించారు. ఆపరేషన్ సిందూర్‌తో భారత ఎయిర్‌ఫోర్స్ విజయం పట్ల తాము గర్విస్తున్నామని చెప్పారు. ఇది అద్భుతమైన ఆపరేషన్ అని కొనియాడారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం భారత్ ఎయిర్‌ఫోర్స్ సాధించిన విజయమన్నారు.

 

ఫైటర్ విమానాలు, ఆయుధాల సప్లయ్ ఆలస్యం అవుతున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పడం ఆందోళన కలిగిస్తోందన్నారు. చైనా, పాక్‌లతో ముప్పు నేపథ్యంలో కేంద్రం భద్రతను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తేలికపాటి యుద్ధ విమానాలు సప్లై అంశం కూడా ఆలస్యం అవుతుందన్నారు. అత్యవసరంగా సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి సూచించారు. ఆపరేషన్, ఆర్‌అండ్‌డీ (రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్) విభాగాల్లోని బెస్ట్ బ్రెయిన్స్ రావడం లేదని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి: