Published On:

IPS Cadre in Telangana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంపు

IPS Cadre in Telangana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంపు

Central Government Approves Increase in IPS Cadre for Telangana: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఐపీఎస్‌ల సంఖ్య 151కి పెరిగింది. అంతకుముందు ఐపీఎస్‌ల సంఖ్య 139 ఉండేది. ఈ మేరకు డీఓపీటీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.

 

రాష్ట్రంలో సీనియర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 76 నుంచి 83కి పెంచింది. అలాగే, స్టేట్ డిప్యూటేషన్ రిజర్వ్ పోస్టులు 20, సెంట్రల్ డిప్యూటేషన్ రిజర్వ్ పోస్టులు 33, లీవ్ రిజర్వ్, జూనియర్ పోస్టులు 13, ట్రైనింగ్ రిజర్వ్ పోస్టులు 2 వరకు పెంచినట్లు తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు చివరి కేడర్ సమీక్ష 2016 ఏప్రిల్‌లో జరిగింది.

 

ఇదిలా ఉండగా, సెంట్రల్ గవర్న్‌మెంట్ ప్రతి ఐదేళ్లకోసారి క్యాడర్‌ సంఖ్యను సమీక్ష నిర్వహిస్తుంది. అయితే తెలంగాణలో అంతకుముందు చివరిసారిగా 2016లో జరిగింది. అయితే 2021లో జరగాల్సి ఉండగా.. కానీ జరగలేదు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సర్కార్‌కు కేంద్ర హోం శాఖ 2021 జనవరి 28న లేఖ రాసింది. ఈ లేఖకు తెలంగాణ సర్కార్ స్పందించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

 

అయితే సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేంద్రానికి లేఖలు రాసింది. ఈ లేఖలో ఐపీఎస్ క్యాడర్‌ను సమీక్షించాలని అందులో పేర్కొంది. ఈ మేరకు కేంద్రం ఐపీఎస్ క్యాడర్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మొత్తం 29 పోస్టులు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరగా.. కేవలం 12 మాత్రమే పెంచింది.