2 Terrorist Arrested: జమ్ముకాశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

2 Terrorist Arrested Jammu & Kashmir: పహల్గామ్ ఉగ్రాదాడి అనంతరం జమ్ముకాశ్మీర్ లో పరిస్థితి మారిపోయింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అలాగే రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా భారీగా తగ్గిపోయింది. దీంతో స్థానికల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడింది. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. జమ్ము కాశ్మీర్ లో ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కేంద్రం కూడా ఉగ్రవాదులను అంతం చేసేందుకు భద్రతా బలగాలకు పూర్తి స్వేచ్ఛను కట్టబెట్టింది.
తాజాగా జమ్ముకాశ్మీర్ ఇద్దరు ఉగ్రవాదులు అరెస్ట్ అయ్యారు. భద్రతా బలగాల సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా షోపియాన్ జిల్లా డీకే పోరా ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ, జమ్ము కాశ్మీర్ పోలీసులు కలిసి వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అందులో రెండు పిస్టల్స్, నాలుగు గ్రనేడ్స్, 43 లైవ్ రౌండ్స్ ఇతర ఆయాధ సామాగ్రిని గుర్తించారు. కాగా భద్రతా బలగాలు వీరిని విచారిస్తున్నాయి. ఉగ్రవాదులు పట్టుబడటంతో భద్రతా బలగాలు మరింత అలర్ట్ అయ్యాయి.