Published On:

Pune : ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాఖ్యలు.. పుణె విద్యార్థిని అరెస్టు

Pune : ఆపరేషన్‌ సిందూర్‌పై వ్యాఖ్యలు.. పుణె విద్యార్థిని అరెస్టు

Pune law student Arrested : భారత్ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌పై విద్యార్థిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో పుణెకు చెందిన యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోలీసులు డిలీట్‌ చేశారు. దీంతో ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

 

పుణెకు చెందిన లా విద్యార్థిని షర్మిస్తా పనోలి గురుగ్రాంలో ఉంటున్నారు. కొద్దిరోజుల కింద ఆమె ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించింది. ఓ వీడియోను ఈ నెల 14న తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు చేస్తూ అభ్యంకర వ్యాఖ్యలు చేసింది. వీడియోపై పాక్ ఫాలోవర్ స్పందించారు. పహల్గామ్ ఘటన తర్వాత భారత సైన్యం చర్యలపై ఆమెను ప్రశ్నించాడు. ఆమె ఒక మతంపై తీవ్రంగా స్పందిస్తూ మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి.

 

విద్యార్థినిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు. రాడికల్ పాక్ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి చంపేస్తామని బెదిరింపులు వచ్చాయి. తాను చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులపై సోషల్ మీడియా వేదికగా ఆమె క్షమాపణలు కోరింది. అప్పటికే వైరల్ కావడంతో కోల్కత్తా పోలీస్ స్టేషన్లో ఆమెపై ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా కోల్కత్తా పోలీసులు షర్మిస్తాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

విద్యార్థినికి లీగల్ నోటీసులను పలుమార్లు పంపారు. అయినప్పటికీ ఆమె, ఆమె కుటుంబం అదృశ్యమై నోటీసులపై స్పందించలేదు. దీంతో లాభం లేదని భావించిన పోలీసులు కోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేశార. దీంతో పోలీసులు ఆమెను గురుగ్రాంలో అరెస్టు చేశారు. ఈ రోజు పనోలిని కోల్కత్తా కోర్టులో హాజరుపర్చనున్నారు. ఆమె అరెస్టు అన్యాయంగా జరిగిందని, ఆమెను వెంటనే విడుదల చేయాలని సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడం గమనార్హం. పోలీసులు 19ఏళ్ల యువతిని అరెస్టు చేయడానికి 1500 కిలోమీటర్లు ప్రయాణించడంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇవి కూడా చదవండి: