India Hits Pakistan Terrorist Camps: పాక్పై ప్రతీకారం.. భారత్ మెరుపు దాడిలో ధ్వంసమైన ఉగ్రవాదుల స్థావరాలు ఇవే!

India Hits Pakistan Nine Terrorist Camps: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇందులో భాగంగానే అర్ధరాత్రి ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఈ మెరుపు దాడిలో భారత్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పాల్గొన్నాయి. పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఉగ్రవాదులకు సంబంధించిన మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేసింది. పాకిస్థాన్లో ఉన్న 4 ప్రదేశాలతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 5 స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మే 7 బుధవారం 1.30 నిమిషాలకు దాడులు చేసింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా.. చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, పాక్ ఆర్మీపై ెలాంటి దాడులు చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.
9 ప్రాంతాలు ఇవే..
1.బహావల్ పూర్
2. మురిడ్కే
3. గుల్ పూర్
4. లష్కర్ క్యాంప్ సవాయి
5. బిలాల్ క్యాంప్
6. కోట్లీ
7. బర్నాలా క్యాంప్
8. సర్జల్ క్యాంపు
9. మొహమూనా క్యాంపు
This is reportedly a video from the Indian strike on Pakistan.
Operation Sindoor.
Radical Islamists pay the price. pic.twitter.com/t1A7EmNZOk
— Hananya Naftali (@HananyaNaftali) May 6, 2025