Last Updated:

Minister Rajendra Pal Gautam: హిందూ దేవుళ్లను పూజించను.. ఢిల్లీలో సామూహిక మతమార్పిడి కార్యక్రమంలో ఆప్ మంత్రి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) మంత్రి, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇటీవల ఒక సామూహిక మత మార్పిడికి హాజరయ్యారు. అక్కడ ప్రజలు హిందూ దేవుళ్ళను మరియు దేవతలను పూజించకూడదని" చేసిన ప్రతిజ్ఞ వీడియో వైరల్ గా మారింది.

Minister Rajendra Pal Gautam: హిందూ దేవుళ్లను పూజించను.. ఢిల్లీలో సామూహిక మతమార్పిడి కార్యక్రమంలో ఆప్ మంత్రి

New Delhi:  ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ ) మంత్రి, రాజేంద్ర పాల్ గౌతమ్, ఇటీవల ఒక సామూహిక మత మార్పిడికి హాజరయ్యారు. అక్కడ ప్రజలు హిందూ దేవుళ్ళను మరియు దేవతలను పూజించకూడదని” చేసిన ప్రతిజ్ఞ వీడియో వైరల్ గా మారింది.

అక్టోబరు 5న బౌద్ధమతం స్వీకరించే దీక్షలో పాల్గొనేందుకు దేశ రాజధానిలోని అంబేద్కర్ భవన్‌లో బుధవారం 10,000 మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. వైరల్ అయిన వీడియోలో, ఆప్ మంత్రి మరియు ఇతరులు ప్రమాణం చేస్తూ, “నాకు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల పై విశ్వాసం లేదు, లేదా నేను వారిని పూజించను. నాకు రాముని పై విశ్వాసం ఉండదు” అని చెప్పడం చూడవచ్చు. రాజేంద్ర పాల్ ట్విట్టర్‌లో ఇలా వ్రాశారు. బుద్ధుని వైపు మిషన్‌ను జై భీమ్ అని పిలుద్దాం. ఈరోజు అశోక విజయదశమి నాడు “మిషన్ జై భీమ్” ఆధ్వర్యంలో 10,000 మందికి పైగా మేధావులు కుల, అంటరాని రహిత భారతదేశాన్ని తయారు చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సంఘటన యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, భారతీయ జనతా పార్టీ (బిజెపి) దానిని “బ్రేకింగ్ ఇండియా” ప్రాజెక్ట్ అని పిలిచింది. ట్విట్టర్‌లో బీజేపీకి చెందిన అమిత్ మాల్వియా ఒక వీడియోను పంచుకున్నారు. అరవింద్ కేజ్రీవాల్ మంత్రి రాజేంద్ర పాల్ “బ్రేకింగ్ ఇండియా” ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నారు. ఈ హిందూ విద్వేష ప్రచారానికి కేజ్రీవాల్ ప్రధాన స్పాన్సర్. ఇది హిందూ, బౌద్ధమతాలను అవమానించడమే. ఆప్ మంత్రులు అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రిని వెంటనే పార్టీ నుంచి తప్పించాలని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ డిమాండ్ చేసారు.

దీనిపై ఆప్ మంత్రి రాజేంద్ర పాల్ గౌతమ్ మాట్లాడుతూ, భాజపా దేశ వ్యతిరేకి. నాకు బౌద్ధమతం పై విశ్వాసం ఉంది. ఎవరికైనా ఎందుకు ఇబ్బంది. ఫిర్యాదు చేయనివ్వండి. రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిస్తుంది. ఏ మతాన్ని అయినా అనుసరించండి. బీజేపీకి ఆప్ అంటే భయం. వారు మాపై ఫేక్ కేసులు మాత్రమే పెట్టగలరని అన్నారు.

ఇవి కూడా చదవండి: