Published On:

IPL 2025 30th Match: రిషభ్ పంత్ ఒంటరి పోరాటం.. చెన్నై టార్గెట్ 167

IPL 2025 30th Match: రిషభ్ పంత్ ఒంటరి పోరాటం.. చెన్నై టార్గెట్ 167

CSK Target is 167 against LSG in IPL 2025 30th Match: లఖ్‌నవూలో జరుగుతోన్న లఖ్‌నవూ, చెన్నై జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. వ్యూహం ప్రకారం బౌలింగ్ చేసిన చెన్నై బౌలర్లు లఖ్‌నవూ టాప్ బ్యాటర్లను కట్టడి చేశారు. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై చెన్నై బౌలర్లు కట్టుబడి బౌలింగ్ చేశారు. దీంతో లఖ్‌నవూ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. కెప్టెన్ పంత్ (63) అర్ధశతకం సాధించి జట్టును ఆదుకున్నాడు. దీంతో లఖ్‌నవూ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది.

 

టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదటగా లఖ్‌నవూ బ్యాటింగ్‌కు దిగింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లఖ్‌నవూ బ్యాటర్లు జాగ్రత్తగా ఆడారు. మొదటి ఓవర్లలోనే మార్‌క్రమ్ (6), మంచి ఫామ్‌లో ఉన్న నికోలస్ పూరన్ (8) అవుట్ అయ్యారు. మిచెల్ మార్ష్‌ (30) మరోసారి తన ఫామ్‌ను కొనసాగించాడు. ప్రమాదకరంగా మారుతున్న మార్ష్‌ను జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. కెప్టెన్ పంత్ (49 బంతుల్లో 63) హాఫ్ సెంచరీ చేశాడు.

 

ఆయుష్ బదోనీ (22), అబ్దుల్ సమద్ (20) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లు మంచి బౌలింగ్ చేసి భారీగా పరుగులు రాకుండా కట్టడి చేశారు. కెప్టెన్ పంత్ చివర్లో వేగంగా పరుగులు చేయడంతో లఖ్‌నవూ‌ మంచి స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేసింది. బౌలర్లు పతిరణ, రవీంద్ర జడేజా 2 వికెట్లు తీశారు. నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్ ఒక్కో వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి: