Published On:

India vs Pakistan War: హర్యానాలో మరో గూఢచారి అరెస్ట్.. భారత్ కీలక విషయాలు పాక్‌కు చేరవేత!

India vs Pakistan War: హర్యానాలో మరో గూఢచారి అరెస్ట్.. భారత్ కీలక విషయాలు పాక్‌కు చేరవేత!

Haryana Student Arrested For Allegedly Shared Key Info With Pakistan: హర్యానాలో ఓ గూఢచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత్‌కు చెందిన రహస్యాలను పాకిస్థాన్ దేశానికి చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

వివరాల ప్రకారం.. 2024లో దేవేంద్ర సింగ్.. కర్తార్ పూనర్ కారిడార్ ద్వారా పాకిస్థాన్ వెళ్లి పాకిస్థానీ నిఘా అధికారిని కలిశాడు. ఆ తర్వాత దేవేంద్ర సింగ్‌ను హనీట్రాప్ ద్వారా బెదిరింపులకు పాల్పడింది. ఈ సమయంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆయనను తమ గుప్పిట్లో పెట్టుకొని భారత సైనిక స్థావరాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగానే దేవేంద్ర సింగ్ ఇండియన్ ఆర్మీకి సంబంధించిన పలు విషయాలను చేరవేస్తున్నాడు.

 

గత కొంతకాలంగా ఇండియన్ ఆర్మీ వివరాలను దేవేంద్ర సింగ్ తెలియజేస్తున్నట్లు పోలీసులు కనిపెట్టారు. దీంతో ఆ గూఢచారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అలాగే నిందితుడికి సంబంధించిన బ్యాంకు అకౌంట్లను సైతం పరిశీలిస్తున్నారు.

 

ఇప్పటికే పాకిస్థాన్ దేశానికి సమాచారం అందిస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమృత్‌సర్‌లో ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేయగా.. జై సల్మేరులో మరరో గూఢచారిని అరెస్ట్ చేశారు. దీంతో పాటు హర్యానాలో ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తుండగా.. ఇంతలోనే దేవేంద్ర సింగ్ కూడా పాక్‌కు సమాచారం అందిస్తున్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే ఆయనను హర్యానాలో అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్నారు.