Telangana Ration Card Holders: రేషన్ కార్డుపై ఇందిరమ్మ అభయహస్తం కింద 9 వస్తువులు.. అవి ఏంటో తెలుసా?

Nine Essential Items to Be Distributed via Indiramma Abhayahastham to Telangana Ration Card Holders: కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలకు సన్నబియ్యం అందించేందుకు మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న ప్రతీ లబ్ధిదారుడికి రేషన్ కార్డుపై సన్నబియ్యంతో పాటు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు అందించనుంది. ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ అభయహస్తం’ కింద 9 రకాల వస్తువులను అందించేలా మరో నిర్ణయం తీసుకుంది.
కాగా, గతంలో కాంగ్రెస్ హయాంలో నిరుపేదలకు ‘అమ్మహస్తం కింద రేషన్ కార్డుదారులకు 9 రకాల వస్తువులు అందించిన విషయం తెలిసిందే. అదే తరహాలో మళ్లీ ‘ఇందిరమ్మ అభయహస్తం’ కింద 6 కిలోల సన్న బియ్యంతో పాటు 9 రకాల ముఖ్యమైన వస్తువులను త్వరలోనే అందించనుంది. ఇంటి అవసరాలకు ఉపయోగపడే కీలకమైన గృహూపకరణాలతో భర్తీ చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగానే రేషన్ కార్డు ఉన్న వారికి 6 కిలోల బియ్యం తో పాటు తొమ్మిది ముఖ్యమైన వస్తువులను ఉచితంగా 2025 మే నాటికి నెలవారీ కిట్తో అందించనుంది.
ఇదిలా ఉండగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ సర్కార్ 2013లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అమ్మ హస్తం పేరుతో సంక్షేమ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ప్రతినెలా 9 రకాల వస్తువులను సబ్సిడీతో రూ.185కు పంపిణీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పథకాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈ పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని భావించింది. ఈ పథకానికి ఇందిరమ్మ అభయహస్తం పేరుతో 9 రకాల వస్తువులను అందించనుంది. ఇక, రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసింది. ఇందుకు గానూ రాష్ట్రంలో 8.30 లక్షల ఫ్యామిలీలకు 17,311 రేషన్ దుకాణాల్లో సుమారు 18వేల టన్నుల బియ్యం పంపిణీ చేసింది.
9 రకాల వస్తువులు ఇవే..
- పప్పులు
- పామ్ ఆయిల్
- గోధుమ పిండి
- బియ్యం పిండి
- చక్కెర
- ఉప్పు
- చింతపండు
- ఎండు మిరపకాయలు
- పసుపు పొడి