Rahul Gandhi : చార్మినార్ అగ్నిప్రమాదంపై రాహుల్ విచారం.. సీఎంకు ఖర్గే ఫోన్

Rahul Gandhi : చార్మినార్ పరిధిలోని గుల్జార్హౌస్లో అగ్నిప్రమాదం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందారు. ఘటనపై సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికే ఆరా తీశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేలు ప్రకటించారు. అన్ని పార్టీల నాయకులు ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా లోక్సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదంలో పలువురు మృతిచెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్కు ఖర్గే ఫోన్..
ముఖ్యమంత్రి రేవంత్కు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. చార్మినార్ అగ్నిప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును ముఖ్యమంత్రి ఖర్గేకు వివరించారు. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఘటనాస్థలికి మంత్రులు వెళ్లినట్లు చెప్పారు.
చార్మినార్లోని గుల్జార్హౌస్లో జరిగినఅగ్నిప్రమాదంలో 17 మంది మృతి దుర్మరణం చెందారు. మృతుల్లో 8 మంది చిన్నారులు ఉన్నారు. ఇవాళ ఉదయం భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకున్న క్షతగాత్రులను ఉస్మానియా దవాఖాన, మలక్పే యశోద, డీఆర్డీవో అపోలో ఆసుపత్రులకు తరలించారు. కరెంట్ షాక్ వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.