Published On:

Schools: జూన్ 6 నుంచి బడిబాట.. ఏర్పాట్లకు విద్యాశాఖ ఆదేశం

Schools: జూన్ 6 నుంచి బడిబాట.. ఏర్పాట్లకు విద్యాశాఖ ఆదేశం

Telangana: రాష్ట్రంలో జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే పాఠశాలలు రీఓపెన్ చేసిన జూన్ 12 రోజునే పిల్లలకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని అనుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ మంది పిల్లలను చేర్పించేలా చర్యలు తీసుకోవడంతోపాటు, చదువుపై అందరికీ అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా రిలీజ్ చేసింది. బడిబాటకు సంబంధించి జూన్ 6న గ్రామసభలు నిర్వహించాలని సూచించింది.

కాగా గ్రామసభలు, బడిబాట కార్యక్రమంలో మహిళా సంఘాలు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలు, స్కూల్ సిబ్బంది, తల్లిదండ్రులు, పాత విద్యార్థులు ఉండేలా తీసుకోవాలని తెలిపింది. అంగన్వాడీ పిల్లలను కూడా సర్కారీ ప్రైమరీ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు చేపట్టాలని, ఐదో తరగతి పూర్తయిన స్టూడెంట్స్ను ఆరో తరగతిలో చేర్పించేలా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

 

గ్రామసభ ఎన్ రోల్మెంట్ కార్యక్రమంలో మహిళా సంఘాలు, పేరెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ ను భాగస్వామ్యం చేయాలని, అందువల్ల ఫలితాలు ఆశాజనకంగా వస్తాయని సమచారం. జూన్ 7న ప్రతీ ఇంటికి వెళ్లడం, బడి వయస్సు పిల్లలను గుర్తించడం, వీఈఆర్ అప్డేట్ చేయాలి. జూన్ 8 నుంచి 10 వరకు అందరికీ కరపత్రాలను పంచుతూ ప్రచారం చేయాలి. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి. అలాగే డ్రాప్ ఔట్ పిల్లలను మళ్లీ బడిలో చేర్పించాలి. జూన్ 12న పాఠశాలలను వేడుకగా రీఓపెన్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. జూన్ 13న ప్రైమరీ స్కూళ్లలో సామూహిక అక్షరాభ్యాసం నిర్వహణ, హైస్కూళ్లలో బాల సభ నిర్వహించాలి. జూన్ 19న బాడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించాలని సూచించింది.