Published On:

Madhuyashki: బీజేపీ వదిలిన బాణం.. ఎమ్మెల్సీ కవితపై మధుయాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు

Madhuyashki: బీజేపీ వదిలిన బాణం.. ఎమ్మెల్సీ కవితపై మధుయాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు

Congress Leader Madhuyashki Sensational Comments on MLC Kavitha: ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్ వేదికగా చిట్ చాట్‌లో మాట్లాడారు. కవిత లేడీ మాఫియా డాన్ అని, కవిత బీజేపీ వదిలిన బాణం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత చేయని దందా, స్కాం లేదని విమర్శించారు.

 

బతుకమ్మ పేరుతో కవిత బతుకనేర్చిందని, కేసుల నుంచి బయట పడాలంటే కవితకి బీజేపీ సహకారం అవసరం ఉందన్నారు. తాగుడుతో ఆడబిడ్డల పుస్తేలతాడులు తెగుతున్నాయన్నారు. కవిత అనేక స్కాములు చేసిందని, జీఎస్టీ, దొంగ నోట్ల స్కాముల్లో కవిత భాగస్వామి ఉందన్నారు. జాగృతి సంస్థ అవినీతి సంస్థ అని, ఆ సంస్థపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

 

రాజీవ్ ప్రతాప్ కేంద్రమంత్రిగా స్కిల్ డెవలప్ చేస్తామని రూ.800 కోట్లు దోచుకున్నారని విమర్శించారు. జాగృతి కోసం ఫీనిక్స్ లాంటి సంస్థల నుంచి డబ్బులు వసూలు చేశారని తెలిపారు. కేసీఆర్ కవితకి పిత, తెలంగాణకి పిశాచి అని ఎద్దేవా చేశారు. జై తెలంగాణ అని పిడికిలి బిగించి దోచుకుంది కేసీఆర్ ఫ్యామిలీ కదా అని ప్రశ్నించారు. కవిత ఏ వ్యాపారం చేసిందని కోట్ల రూపాయలు సంపాదించిందన్నారు.

 

అవినీతి సొమ్మును జాగ్రత్తగా కాపాడుకోవడానికే కవిత జాగృతిని బలోపేతం చేస్తోందని విమర్శించారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ఆదేశాల మేరకే కవిత పనిచేస్తోందన్నారు. బీఆర్ఎస్ వీక్ అయితే బీజేపీ లబ్ధి పొందుతుందని, తెలంగాణ రాక ముందు వసూళ్ల కోసం వాడుకున్న సంస్థ జాగృతి అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

 

తెలంగాణ వచ్చాక రైతులకు సహాయం చేస్తామన్నారని, కానీ కవిత ఇప్పటికీ బీసీ, ఎస్సీలకు నయాపైసా సహాయం చేయలేదన్నారు. స్వార్ధ రాజకీయాల కోసమే బీసీ నినాదం ఎత్తుకుందన్నారు. బీసీల కోసం మాట్లాడుతున్న కవిత జాగృతిని బీసీల చేతిలో పెట్టలేదని ప్రశ్నించారు.

 

కేసీఆర్ జీవిత లక్ష్యం తెలంగాణ సాధన కాదని, తెలంగాణకి సీఎం కావడమే అని అన్నారు. తనని సీఎంని చేస్తే పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని సోనియాకి చెప్పినట్లు గుర్తు చేశారు. చెట్ల సంతోష్ ఇప్పుడు చెట్లను ఎందుకు నాటడం లేదని ప్రశ్నించారు. అమెరికా, దుబాయ్‌లలో కేటీఆర్, కవితలకి పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఇన్వెస్ట్మెంట్ చూసుకోవడానికే కేటీఆర్ విదేశాలకు వెళ్తున్నారని తెలిపారు.

 

సోనియా గాంధీ.. తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్, కేటీఆర్ మొహంజాహీ మార్కెట్లో గులాబీ పూలు అమ్ముకునే వాళ్లని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాకపోతే కవిత ఏపీలో బ్యూటీ పార్లర్ పెట్టుకునేదని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ జెండా కూడా ఎగరేయలేదని విమర్శించారు. లిక్కర్ స్కాంలో కేసీఆర్ కూడా భాగస్వామి అని, ప్రగతి భవన్‌లోనే లిక్కర్ స్కాం చర్చలు జరిగాయని మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు.