Nara Lokesh: పశువుల పాకలో పాఠాలు.. స్పందించిన మంత్రి లోకేష్

Nara Lokesh: అల్లూరు జిల్లాలోని అరకు నియోజకవర్గంలోని లబుడుపుట్టు గ్రామంలో పశువుల శాలలోనే విద్యనభ్యసిస్తున్నారు. స్థానిక జిపిఎస్ పాఠశాలలో 32 మంది విద్యార్థులకు ఏళ్లుగా పాకలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. పాఠశాల భవనం కుప్పకూలడంతో వర్షంలోనే విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎడతెరిపిలేని వర్షాలతో సరైన భవనం లేక పిల్లలు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని గ్రామస్తులు వాపోయారు. అలాగే ప్రధాన ఉపాధ్యాయులు కూడా బడికి సరిగా రావటం లేదని గ్రామస్తులు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి, నూతన పాఠశాల భవనం నిర్మించాలని కోరారు.