Published On:

Chardham Yatra 2025: చార్‌ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Chardham Yatra 2025: చార్‌ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

Chardham Yatra 2025: ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంతోపాటు, యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి తెలిపారు. “వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకుని, చార్‌ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశాం. వాతావరణం మామూలు స్థితికి వచ్చాక యాత్రను కొనసాగిస్తాము. యాత్రికుల భద్రతే మా ప్రాధాన్యత. ఏదైనా విపత్తు సంభవిస్తే NDRF మరియు SDRF పూర్తిగా సిద్ధంగా ఉన్నాయి” అని ఆయన హరిద్వార్‌లో అన్నారు.

 

చార్‌ధామ్ యాత్ర గతంలోను నిలిపివేసారు

ఉత్తరాఖండ్‌లోని బార్‌కోట్ సమీపంలో భారీ వర్షాలు సంభవిస్తున్నాయి.   కొండచరియలు విరిగిపడటం వలన రోడ్డు బ్లాక్ అయింది. ప్రస్తుతానికి చార్‌ధామ్ యాత్రను 24 గంటల పాటు నిలిపివేసినట్లు అధికారులు ధృవీకరించారు.

భారత వాతావరణ శాఖ జారీ చేసిన భారీ వర్ష హెచ్చరిక తర్వాత ఆదివారం యాత్రను నిలిపివేశారు. కొద్దిసేపటికే, ఉత్తరకాశి జిల్లాలోని బార్‌కోట్-యమునోత్రి రహదారిపై సిలై బ్యాండ్ సమీపంలో మేఘాల విస్ఫోటనం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. అధికారుల ప్రకారం, ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు కనిపించకుండా పోయారు.

ఇవి కూడా చదవండి: