Last Updated:

Hariramajogaiah: ఏపీలో బై బై వై.సి.పి. నినాదం నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకం.. హరిరామజోగయ్య

ఏపీ లో ప్రతి సాధారణ ఎన్నికలలో కులాలే విజయావకాశాలు శాసిస్తున్నాయని ,జనసేనాని పవన్ కళ్యాణ్ నినాదం అయిన బై బై వైసీపీ నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకమని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు . ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేసారు . రాష్ట్రంలో ప్రస్తుతం 45శాతం బి.సి. లు ,18శాతం కాపులు, 16శాతం ఎస్.సి.లు, 6 శాతం ఎస్.టి.లు ,6శాతం రెడ్లు, 4శాతం కమ్మ 5శాతం యితరులు ఉన్నారని పేర్కొన్నారు

Hariramajogaiah: ఏపీలో బై బై వై.సి.పి. నినాదం నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకం.. హరిరామజోగయ్య

Hariramajogaiah: ఏపీ లో ప్రతి సాధారణ ఎన్నికలలో కులాలే విజయావకాశాలు శాసిస్తున్నాయని ,జనసేనాని పవన్ కళ్యాణ్ నినాదం అయిన బై బై వైసీపీ నిజం కావాలంటే కాపుల ఓట్లే కీలకమని మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య అన్నారు . ఈ మేరకు ఆయన ఒక లేఖ విడుదల చేసారు . రాష్ట్రంలో ప్రస్తుతం 45శాతం బి.సి. లు ,18శాతం కాపులు, 16శాతం ఎస్.సి.లు, 6 శాతం ఎస్.టి.లు ,6శాతం రెడ్లు, 4శాతం కమ్మ 5శాతం యితరులు ఉన్నారని పేర్కొన్నారు .2019 ఎన్నికలో వై.ఎస్.ఆర్.పార్టీ సాధించిన 51శాతం ఓట్లలలో 20శాతం బి.సి.లు, 16శాతం ఎస్.సి., ఎస్.టి.లు, 5శాతం రెడ్లు , 8శాతం కాపులు, 2శాతం యితరులు వున్నారని జోగయ్య వివరించారు . 25శాతం బిసిలు, 4శాతం కమ్మ, 4శాతం కాపులు, 4శాతం ఎస్.సి., ఎస్.టి.లు ,3శాతం యితరులు టీడీపీ కి వేయటం జరిగిందని , జనసేనకు 6శాతం కాపులు ,1శాతం యితరులు వేయటం జరిగిందని జోగయ్య ఆ లేఖలో పేర్కొన్నారు .

వారాహి యాత్రతో తగ్గిన కాపు ఓట్లు..(Hariramajogaiah)

అయితే జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర ప్రారంభించిన తర్వాత వై.ఎస్.ఆర్.పార్టీ కి సపోర్ట్ చేస్తున్న కాపుల ఓట్లు 8శాతం నుండి 5శాతం కోల్పోయి నట్లు జోగయ్య తెలిపారు . దింతో 2019 లో వైసీపీకి వచ్చిన ఓట్లు 51 శాతం నుండి 46 శాతానికి పడినట్లు జోగయ్య పేర్కొన్నారు . ఈ 5 శాతం కాపులు ఓట్లు జనసేనకు కలిశాయన్నారు . దింతో తెలుగుదేశం, జనసేన, బి.జె.పి. కూటమి ఓట్లు 52శాతానికి పెరగటం జరిగిందని వివరించారు .ఈ నేపథ్యంలో కాపుల ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగాలంటే జనసేన, తెలుగుదేశం ఓటర్లు పూర్తి గ సంతృప్తి చెందేటట్లు పొత్తు ధర్మం పాటిస్తూ గౌరవప్రదమైన హోదాలతో ఉభయుల మధ్య అధికారం పంపిణీ జరగబోతోందనే నమ్మకాన్ని ఉభయపార్టీల నేతలు తమ ఓటర్లలో కలిగించటం ఎంతైనా అవసరం ఉందని జోగయ్య తెలిపారు .

పొత్తు ధర్మానికి అనుగుణంగానే ఉభయకార్యకర్తలు సంతృప్తిచెందేలా అధికార పంపిణీ జరగబోతోందని వార్తలు అందుతున్నాయని అన్నారు . అనుభవజ్ఞుడైన చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలోను, లా అండ్ ఆర్డరు, హోమ్ శాఖ పోర్ట్ ఫోలియోలతో పవన్ కల్యాణ్ రెండవస్థానంలోను రాబోయే ప్రభుత్వంలో కొనసాగనున్నారని సమాచారం ఉందని జోగయ్య తెలిపారు . ఈ వార్త ఇటు తెలుగుదేశం కార్యకర్తలను, అటు జనసైనికులను పూర్తిగా సంత్రుప్తిపరచగలిగేది గా ఉంటే సవ్యంగా ఓట్ల ట్రాన్స్ఫర్ జరగటానికి దోహదం చేస్తుందని అప్పుడు బై బై వైసీపీ అనే నినాదాన్ని నిజం అవుతుందని జోగయ్య ఆశాభావం వ్యక్తం చేసారు.

ఇవి కూడా చదవండి: