Published On:

Minister Tummala Nageswara Rao: రాష్ట్రంలో అందరూ పేదోళ్లేనా?.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు!

Minister Tummala Nageswara Rao: రాష్ట్రంలో అందరూ పేదోళ్లేనా?.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు!

Minister Tummala Nageswara Rao Comments: రాష్ట్రంలో అమలవుతున్న ఉచిత పథకాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితంగా పథకాలు అందరికీ ఇవ్వడం సరికాదన్నారు. అర్హులైన నిరుపేదలకే ఉచిత పథకాలు అందాలని మంత్రి అభిప్రాయపడ్డారు. అనర్హులకు పథకాలు అందడం సరికాదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రస్తుతం రూ.60 ధర ఉన్న కిలో బియ్యాన్ని ఉచితంగా ఇవ్వడం సముచితమా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కోటి 10 లక్షల కుటుంబాలు ఉండగా.. ఇందులో కోటి 25 రేషన్ కార్డులు ఉన్నట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంటే దీనిని బట్టి చూస్తే.. రాష్ట్రంలో అందరూ పేదోళ్లేనా? అన్నారు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి విషయాలు చెప్పకూడదని తుమ్మల అన్నారు.

 

గతంలో సీనియర్ ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రూ.2కు కిలో బియ్యం ఇస్తే దేవుడిలా చూశారని, కానీ ప్రస్తుతం కేజీ రూ.60 ఉన్న బియ్యంను మేం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచితంగా ఇస్తున్నామన్నారు. దీంతో ప్రభుత్వంపై అధికా భారం పడుతుందని వెల్లడించారు.