Published On:

Swimming: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

Swimming: చిత్తూరు జిల్లాలో విషాదం.. ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థుల మృతి

Three students died: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగంది. వి. కోట మండలం మోట్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులంతా సరదాగా ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి నీటిలో మునిగిపోగా.. ఒకరి తర్వాత ఇంకొకరు కాపాడబోయి ముగ్గురు చనిపోయారు. చనిపోయిన విద్యార్థులను కుషాల్, నిఖిల్, జగన్ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన వారిలో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందినవారిగా నిర్ధారించారు.