Home / Chittoor
Three students died: చిత్తూరు జిల్లాలో తీవ్ర విషాద ఘటన జరిగంది. వి. కోట మండలం మోట్లపల్లి చెరువులో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. వేసవి సెలవులు కావడంతో విద్యార్థులంతా సరదాగా ఈత కొట్టేందుకు చెరువు వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి నీటిలో మునిగిపోగా.. ఒకరి తర్వాత ఇంకొకరు కాపాడబోయి ముగ్గురు చనిపోయారు. చనిపోయిన విద్యార్థులను కుషాల్, నిఖిల్, జగన్ గా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]
Kumki Elephants: చిత్తూరు జిల్లా కుప్పంలోని ననియాల ఎలిఫెంట్ క్యాంపునకు మరో 2 కుంకీ ఏనుగులు చేరుకున్నాయి. కర్ణాటక నుంచి వినాయక, జయంత్ అనే పేర్లు గల ఏనుగులను కుప్పంలోని ఎలిఫెంట్ క్యాంపు అటవీ అధికారులకు అప్పగించారు. మొత్తంగా 6 కుంకీలను ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరాగా.. పది రోజుల క్రితం 4 కుంకీ ఏనుగులు పలమనేరులోని ముసలిమడుగు ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్దకు వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం […]
AP CM Chandrababu Naidu’s Housewarming Ceremony: ఏపీ సీఎం చంద్రబాబు గృహప్రవేశం అంగరంగ వైభవంగా జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పంలో కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు గృహప్రవేశం చేశారు. ఇవాళ తెల్లవారుజాము 4:30 గంటలకు గృహప్రవేశ పూజా కార్యక్రమం నిర్వహించారు. సీఎం కుటుంబ సభ్యులు సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం ఉదయం 10 గంటలకు టీడీపీ నాయకులు, ప్రజలను చంద్రబాబు దంపతులు కలువనున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు […]
Chittoor: ఏపీ సీఎం చంద్రబాబు నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. కుప్పంలో జరిగే ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కుప్పం పర్యటన ముగించుకుని సాయంత్రానికి అమరావతికి చేరుకోనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కాగా కొద్దిరోజులుగా తిరుపతి శ్రీ గంగమాంబ ఆలయ ప్రధాన దేవత ప్రసన్న గంగమ్మ జాతర సాగుతోంది. దీంతో […]