Published On:

Kommineni : అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు.. కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

Kommineni : అమరావతి మహిళలపై అసభ్య వ్యాఖ్యలు.. కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్

Kommineni Srinivasa Rao remanded for 14 days : రాజధాని మహిళలపై కొమ్మినేని శ్రీనివాసరావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన్ను ఈ నెల 9వ తేదీన హైదరాబాద్‌లోని జర్నలిస్టు కాలనీలోని తన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. కేసులో శ్రీనివాసరావుతోపాటు మరో జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు నిందితుడిగా ఉన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పీఎస్‌లో రాజధాని రైతులు, మహిళల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. సాక్షి టీవీలో శ్రీనివాసరావు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో కృష్ణంరాజు అమరావతి మహిళలను ‘వేశ్యల రాజధాని’గా అభివర్ణిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారని, కొమ్మినేని వ్యాఖ్యలను సమర్థించినట్లు ఆరోపణలు వచ్చాయి.

 

తీవ్ర నిరసనలు..
ఘటనపై ఏపీ వ్యాప్తంగా మహిళా, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం, ఐటీ చట్టం కింద నాన్-బెయిలబుల్ సెక్షన్లలో శ్రీనివాసరావు, కృష్ణంరాజు, సాక్షి యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. కొమ్మినేని శ్రీనివాసరావును సోమవారం ఉదయం పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. అనంతరం గుంటూరు రూరల్ నల్లపాడు పీఎస్‌కు తరలించారు. ఇవాళ ఉదయం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మంగళగిరి కోర్టులో హాజరుపర్చారు. దీంతో కోర్టు కొమ్మినేనికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

ఇవి కూడా చదవండి: