Published On:

Ankineedu Prasad : మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్‌ కన్నుమూత

Ankineedu Prasad : మాజీ ఎంపీ అంకినీడు ప్రసాద్‌ కన్నుమూత

Former MP Ankineedu Prasad passes away : చల్లపల్లి రాజా తనయుడు, మచిలీపట్నం మాజీ ఎంపీ శ్రీమంతురాజా యార్లగడ్డ అంకినీడు ప్రసాద్‌ బహద్దూర్‌ (86) కన్నుమూశారు. కోయంబత్తూరులోని తన నివాసంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ప్రసాద్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం శనివారం కృష్ణా జిల్లా చల్లపల్లికి తీసుకురానున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చల్లపల్లిలోని ఎస్‌ఆర్‌వైఎస్‌పీ జూనియర్‌ కళాశాలకు అంకినీడు కరస్పాండెంట్‌గా ఉన్నారు.

 

అంకినీడు మృతి చల్లపల్లికి తీరని లోటు : మండలి బుద్ధప్రసాద్‌
మాజీ ఎంపీ అంకినీడు మృతి పట్ల అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ సంతాపం తెలిపారు. జమీందారు, ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ ప్రజలకు సేవ చేసిన చరిత్ర చల్లపల్లి జమీందారు వంశీయుల సొంతమని కొనియాడారు. చల్లపల్లి ఎస్టేట్‌ ఆలయాల అనువంశిక ధర్మకర్తలుగా ఈ ప్రాంతంలోని మోపిదేవి, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి, యార్లగడ్డ, శివగంగలోని ప్రముఖ ప్రాచీన దేవాలయాల అభివృద్ధి, నిర్వహణలో శ్రీమంతురాజా యార్లగడ్డ శివరామప్రసాద్‌ బహద్దూర్‌ బాటలో అంకినీడు ప్రసాద్‌, వారి సోదరులు విశేష కృషి చేశారన్నారు. ఎస్‌ఆర్‌వైఎస్‌పీ ఉన్నత పాఠశాల, కాలేజీ ద్వారా వేలాదిమంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అంకినీడు మృతి చల్లపల్లి ప్రాంతానికి తీరని లోటని పేర్కొన్నారు.

 

ఎవరు వెళ్లినా సాయం చేసేవారు : ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల
మాజీ ఎంపీ అంకినీడు తమకు అత్యంత సన్నిహితుడని ఆర్టీసీ చైర్మన్‌ కొనకళ్ల నారాయణ అన్నారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా ఎవరు వెళ్లినా సమస్యలు విని సాయం చేసే గొప్ప మనిషి అన్నారు. వివాదరహితుడిగా అన్నివర్గాల ప్రజల ప్రేమాభిమానాలు పొందిన మానవతా వాది అని కొనియాడారు. అరుదైన రాజకీయ నేత అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థించారు.

ఇవి కూడా చదవండి: