Published On:

Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు కేంద్ర మంత్రులతో భేటీ!

Chandrababu Delhi Tour: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు కేంద్ర మంత్రులతో భేటీ!

Chandrababu Delhi Tour: ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. నేడు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు, పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. పథకాల అమలుకు రాష్ట్రానికి సహకరించాలని కోరారు. పర్యటనలో భాగంగా ఏడుగురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. నేడు ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం కానున్నారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఏపీకి సహకారం అందించాలని కోరనున్నారు.

 

అనంతరం ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు. రాష్ట్రంలో వ్యూహాత్మక రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. అలాగే బీఈఎల్ డిఫెన్స్ కాంప్లెక్స్, హెచ్ఏఎల్- ఏఎంసీఏపై మాట్లాడుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు జల్ శక్తి మందత్రి పాటిల్ ను కలవనున్నారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్టుకు కావల్సిన నిధులు, రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులకు ఆర్థిక సాయంపై మాట్లాడనున్నారు.

 

మధ్యాహ్నం 3 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, వాటి కావల్సిన ఆర్థిక సాయంపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి రావల్సిన నిధులపై, రాజధాని అమరావతి నిర్మాణం, పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవనున్నారు. నూతనంగా అమలవుతున్న నేర చట్టాల అమలుపై సమీక్ష నిర్వహించనున్నారు. రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అవనున్నారు. రేపు జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి భేటీలో పాల్గొననున్నారు.