Covid-19: తగ్గని కరోనా ఉధృతి.. దేశంలో 7 వేలు దాటిన కేసులు
Corona Virus: దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. పైగా పాజిటీవ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 306 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. నిన్న ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు 306 మందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న యాక్టీవ్ కేసుల సంఖ్య 7121 కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం కేరళలో 170, గుజరాత్ లో 114 కేసులు బయటపడ్డాయి. ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి ఆరుగురు మరణించారు. వీరిలో కేరళలో ముగ్గురు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు చొప్పున మరణించారు. దీంతో ఈ ఏడాది కరోనాతో మరణించిన వారి సంఖ్య 74కి చేరింది.
కాగా ప్రస్తుతం కేరళలో 2,223 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. గుజరాత్ 1,223, ఢిల్లీ 757, వెస్ట్ బెంగాల్ 747, మహారాష్ట్ర 615, కర్ణాటక 459, యూపీ 229, తమిళనాడు 204, రాజస్థాన్ 138, హర్యానా 125, ఏపీ 72, మధ్యప్రదేశ్ 65, ఛత్తీస్ గఢ్ 48, బీహార్ 47, ఒడిశా 41, సిక్కిం 33, పంజాబ్ 33, తెలంగాణ 11, జార్ఖండ్ 10, పుదుచ్చేరి 10, జమ్ముకాశ్మీర్ 9, అస్సాం 6, గోవా 6, ఛండీగడ్ 3, ఉత్తరాఖండ్ 3, హిమాచల్ ప్రదేశ్ 2, మణిపూర్ 1, త్రిపుర 1 చొప్పున యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి పట్ల కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఎప్పటికప్పుడు రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటోంది.