OMC Case: అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్.. సీబీఐ విధించిన శిక్ష రద్దు
Gali Janardhan Reddy bail in OMC Case: ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో పురోగతి చోటుచేసుకుంది. ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ మేరకు సీబీఐ విధించిన శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రూ.10 లక్షల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.
అలాగే ఇండియా విడిచి ఎక్కడికి వెళ్లిపోవడానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు పాస్ పోర్టు సరెండర్ చేయాలని గాలి జనార్దన్ రెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఈ కేసులో నలుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన పీఏ అలీఖాన్, బీవీ శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్కు బెయిల్ మంజూరు చేసింది. గతంలో ఈ నలుగురికి నాంపల్లి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.