Bhairavam: బందరులో భైరవం మూవీ టీమ్.. బీచ్ ఫెస్టివల్ లో సందడి

Machilipatnam: భైరవం మూవీ టీమ్ మచిలీపట్నంలో సందడి చేసింది. అక్కడ జరుగుతున్న మసూల బీచ్ ఫెస్టివల్ లో పాల్గొంది. అయితే మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ లో జూన్ 8 వరకు బీచ్ ఫెస్టివల్ జరగనుంది. అందులో భాగంగా నేడు 2కే రన్ నిర్వహించారు. అందులో భైరవం మూవీ టీమ్ పాల్గొంది. బీచ్ ఫెస్టివల్ ప్రచారం కోసమే 2కే రన్ నిర్వహించినట్టు అధికారులు చెప్పారు. అందులో భాగంగానే మూవీ నటీనటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ తో పాటు సినిమా సభ్యులంతా సందడి చేశారు.
ఇక బీచ్ ఫెస్టివల్ లో బీచ్ వాలీబాల్, హెలికాప్టర్ రైడ్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ కోర్టులు, మామిడి పండ్ల ప్రదర్శన, 100 అడుగుల దోశ ప్రత్యే ఆకర్షణగా నిలవనుంది. ఏపీ టూరిజం, కృష్ణా జిల్లా అధికారులు సంయుక్తంగా ఈవెంట్ నిర్వహిస్తున్నారు. కాగా బీచ్ ఫెస్టివల్ కు జిల్లా నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.