PM Modi: ప్రధాని మోదీ నాటిన ఈ మొక్క ప్రాముఖ్యత తెలుసా.!
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసంలో సిందూర్ మొక్కను నాటారు. X లో పోస్ట్ను షేర్ చేస్తూ, ఇటీవల గుజరాత్ పర్యటన సందర్భంగా కచ్లోని ధైర్యవంతులైన తల్లులు మరియు సోదరీమణులు ఈ మొక్కను తనకు బహుమతిగా ఇచ్చారని అన్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా, పీఎం ఆయన నివాసంలో ఒక సిందూర్ మొక్కను నాటారు. 1971 యుద్ధంలో పాల్గొన్న మహిళల బృందం ఈ మొక్కను ఆయనకు బహుమతిగా ఇచ్చారు.
“1971 యుద్ధంలో సాహసం మరియు పరాక్రమం యొక్క అద్భుతమైన సందేశం. 1971 యుద్ధంలో ధైర్యం, పరాక్రమానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచిన కచ్లోని వీర తల్లులు మరియు సోదరీమణులు ఇటీవల గుజరాత్లో నా పర్యటన సందర్భంగా సింధూర మొక్కను బహూకరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటాం. ఈ మొక్క మన దేశంలో స్త్రీ శక్తికి బలమైన ప్రతీకగా నిలుస్తుంది.” అని చెప్పారు.
ప్రపంచ వాతావరణాన్ని కాపాడటానికి ప్రతి దేశం ముందుకు రావాలని ప్రధాన మంత్రి మోదీ అన్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించడంలో భాగంగా భారతదేశం గత ఐదు సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తోందని ఆయన అన్నారు.
“ఈ #ప్రపంచ పర్యావరణ దినోత్సవం, మన గ్రహాన్ని రక్షించడానికి మరియు మనం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి మన ప్రయత్నాలను మరింతగా పెంచుకుందాం. మన పర్యావరణాన్ని పచ్చగా మరియు మెరుగ్గా చేయడానికి అట్టడుగు స్థాయిలో పనిచేస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.