Published On:

Ahmedabad Plane Crash : ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో 133 మంది మృతి..?

Ahmedabad Plane Crash : ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదంలో 133 మంది మృతి..?

Ahmedabad  : అహ్మదాబాద్‌ విమానాశ్రయానికి సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయింది. ఘటనలో 133 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.

 

ఎయిర్‌ ఇండియా ఫ్లైట్ గురువారం మ‌ధ్యాహ్నం 1.39లకు లండన్ బయలు దేరింది. ఇందులో ఇద్దరు పైల‌ట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది సహా 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 242 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 53 మంది బ్రిటన్‌ దేశస్తులు, 7 మంది పోర్చుగల్‌ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు.

 

20 మంది మెడికోలు మృతి?
విమానం టేకాఫ్‌ అయిన నిమిషాల వ్యవధిలోనే విమానాశ్రయానికి స‌మీపంలోని సివిల్ ఆసుపత్రి వ‌ద్ద బీజే మెడిక‌ల్ కళాశాల హాస్టల్ భ‌వ‌నంపై కుప్పకూలింది. ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ప్రమాదంలో హాస్టల్‌ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. హాస్టల్ భవనంలో 20 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి: