Published On:

PM Modi: ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ రీలాంచ్.. మొక్కలు నాటిన ప్రధాని

PM Modi: ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ రీలాంచ్.. మొక్కలు నాటిన ప్రధాని

Aravali Green Wall Project: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దక్షిణ ఢిల్లీలోని ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ రీలాంచ్ చేశారు. అందులో భాగంగా ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మోదీ మర్రిచెట్టును నాటారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశంలో పచ్చదనం వెల్లివిరిసేలా ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అందులో భాగంగానే పెద్ద సంఖ్యలో చెట్లను నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

 

కాగా ఆరావళీ పర్వత ప్రాంతాల్లో విస్తరించిన హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ రాష్ట్రాల్లోని 29 జిల్లాలో చెట్లను పెంచి అటవీ ప్రాంత విస్తరణతో పాటు పర్యావరణ పరిరక్షణ చేయడమే లక్ష్యంగా కేంద్రం ఆరావళీ గ్రీన్ బెల్ట్ ప్రాజెక్ట్ ను చేపట్టింది. కాగా ప్రాజెక్ట్ రీలాంచింగ్ ప్రోగ్రాంలో నాలుగు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రధాని మోదీతో కలిసి కార్యక్రమంలో పాల్గొనగా.. హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ దాద్రిలో కార్యక్రమం నిర్వహించారు. గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కేడాలో, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ రామ్ గర్ లో ప్రోగ్రాం నిర్వహించారు. ఆరావళి పర్వతాల్లో 700 కిలోమీటర్ల పరిధిలో పర్యావరణ సమతుల్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ఆరావళీ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ ను కేంద్రం చేపట్టింది.