Last Updated:

Amith Shah: పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన కామెంట్స్

మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ జమ్మూ-కశ్మీరుని మార్చుతామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Amith Shah: పాకిస్థాన్‌తో చర్చలపై అమిత్ షా సంచలన కామెంట్స్

Amith Shah: మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జమ్మూ-కశ్మీరు నుంచి ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోనే అత్యంత ప్రశాంతతగల ప్రాంతంగా ఈ జమ్మూ-కశ్మీరుని మార్చుతామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్‌తో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

కేంద్ర మంత్రి అమిత్ షా అక్టోబర్ 4 మంగళవారం నుంచి కశ్మీర్లో పర్యటిస్తున్న సంగతి విదితమే. కాగా నేడు బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. జమ్మూ-కశ్మీరులో 1990 నుంచి ఇప్పటి వరకు ఉగ్రవాదం వల్ల 42,000 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఉగ్రవాదం వల్ల ఎవరైనా లబ్ధి పొందారా? అని అక్కడి వారిని ప్రశ్నించారు.
జమ్మూ-కశ్మీరు అభివృద్ధిలో వెనుకబడటానికి ముఖ్యంగా ఆ మూడు కుటుంబాలే కారణమని దుయ్యబట్టారు. అబ్దుల్లాలు (నేషనల్ కాన్ఫరెన్స్), ముఫ్తీలు (పీడీపీ), నెహ్రూ-గాంధీలు (కాంగ్రెస్) వల్లే ఈ కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఈ రాష్ట్రాన్ని వారే పరిపాలించారన్నారు. ఇకపోతే కొంతమంది పాకిస్థాన్తో చర్చలు జరపాలని అంటున్నారని, అసలు మనం ఆ దేశంతో ఎందుకు చర్చలు జరపాలని ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ తో మనం చర్చలు జరిపేది లేదన్నారు.

మనం బారాముల్లా ప్రజలతో, కశ్మీరు ప్రజలతో మాట్లాడతామని అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉగ్రవాదాన్ని సహించదని, దాన్ని తుదముట్టి తీరుతామని ఆయన పేర్కొన్నారు.
జమ్మూ-కశ్మీరును దేశంలో అత్యంత ప్రశాంతంగా ఉండే ప్రదేశంగా మార్చాలనేది తమ లక్ష్యమని చెప్పారు.కాగా అమిత్ షా గురువారం కూడా కశ్మీరులో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: సోషల్ మీడియా పరిచయం.. వైద్యులతో కలిసి అత్యాచారం

ఇవి కూడా చదవండి: