Tirumala: శ్రీవారికి వెండి అఖండాలను సమర్పించిన మైసూరు రాజమాత

Mysore Rajamatha Silver Lamps Offered to Tirupati Balaji: మైసూరు రాజమాత ప్రమోదాదేవి రెండు భారీ వెండి అఖండాలను తిరుమల శ్రీవారి ఆలయానికి విరాళంగా సమర్పించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో రంగనాయక మండపంలో వాటిని స్వీకరించారు. ఒక్కో వెండి అఖండం బరువు సుమారు 50 కిలోలు ఉంటుందని అధికారులు తెలిపారు. దాదాపు 300 ఏళ్ల కిందట అప్పటి మైసూరు మహారాజు సైతం ఇలాంటి అఖండాలను విరాళం ఇవ్వగా వాటిని గర్భగుడిలో వెలిగిస్తుంటారు. మూడు శతాబ్దాల తర్వాత మళ్లీ ఇప్పుడు మైసూరు రాజమాత వెండి అఖండాలను సమర్పించడం విశేషం.
రంగనాయకుల మండపంలో జరిగన కార్యక్రమంలో రాజమాత ప్రమోదా దేవీ టీటీడీ చైర్మెన్ బి.ఆర్. నాయుడుకు అందించారు. ఈ కార్యక్రమానికి అదపను కార్యనిర్వహణ అధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి పలువురు అధికారులు హాజరయ్యారు.