Published On:

Jyoti Malhotra : రెండేండ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో జ్యోతి మ‌ల్హోత్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Jyoti Malhotra : రెండేండ్ల క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో జ్యోతి మ‌ల్హోత్రా.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Jyoti Malhotra’s video goes viral on social media : రెండేళ్ల కింద సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో హ‌ర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగ‌ర్ జ్యోతి మ‌ల్హోత్రా సంద‌డి చేసింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. రెండేళ్ల కింద బీజేపీ ఎంపీలు బండి సంజయ్, కిషన్‌రెడ్డి, అప్పటి గవర్నర్ తమిళిసై క‌లిసి సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో వందే భార‌త్ రైలును ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి ఆమె మీడియా పేరుతో హాజ‌రయ్యారు. రైలు గురించి చెబుతూ వీడియో చిత్రీక‌రించింది. సికింద్రాబాద్ స్టేష‌న్ దృశ్యాల‌తోపాటు రైలు లోప‌లి దృశ్యాల‌ను చిత్రీక‌రించారు.

 

పాక్ నిఘా అధికారులకు కీలక సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై హర్యానాకు చెందిన ఓ ట్రావెల్‌ బ్లాగర్‌‌తోపాటు ఆరుగురు భారతీయులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి: