Published On:

Pakistan Meeting on Nuclear Weapons: అణుయుద్ధంపై పాకిస్తాన్ యూ టర్న్

Pakistan Meeting on Nuclear Weapons: అణుయుద్ధంపై పాకిస్తాన్ యూ టర్న్

Pakistan High Level meeting on Nuclear Weapons: అణుబాంబుల విషయంలో పాకిస్తాన్ భయంతో వణుకుతుంది. అణ్వాయుధాలపై చర్చించేందుకు నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశం కావాలని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. అయితే అదేమీ లేదని పాకిస్తాన్ రక్షణమంత్రి ఖ్వాజా అసిఫ్ కొట్టి పారేశారు. భారత్ భయపెట్టాలనుకున్న పాకిస్తాన్‌కు.. స్వదేశంలోనే విమర్శలు వచ్చాయి. భయంతో సమావేశాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంది. దేశ అంతర్గత వ్యవహారాల్లోనూ పాకిస్తన్ కు సమన్వయం లేదు. ఉగ్రవాదులకోసం పక్కదేశంతో యుద్ధం చేసే దేశం పాాకిస్తన్ తప్ప మరొకటి లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అణ్వస్త్రాల సమావేశం యూటర్న్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ జరుగుతుంది.

 

పాకిస్థాన్ ల్యాంచ్‌పాడ్‌ను భారత్ ధ్వంసం చేసింది. సియాల్‌కోట్ ఉగ్రదాదుల స్థావరం దాడులు చేసింది. ఈ దాడులలో పాకిస్థాన్‌లో 4ఎయిర్‌బేస్‌లు, పాకిస్థాన్‌లోని 3సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. రావల్పిండి, షేర్‌కోట్, చక్వాల్ ఎయిర్‌బేస్‌లు ధ్వంసం అయ్యాయి. అలాగే ఇస్లామాబాద్ దగ్గర రహీమ్‌యార్ ఎయిర్‌బేస్ ధ్వంసం అయింది. మరోవైపు పాక్‌లోని మూడు రాడార్ స్టేషన్లపై భారత్ దాడి చేసింది. భారత్ దాడితో పాకిస్థాన్ HQ-9 సిస్టమ్‌ ధ్వంసమయింది.

 

S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టంను కూల్చేశామని పాక్ అసత్య ప్రచారం చేస్తోంది. కానీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టం సమర్ధవంతంగా పనిచేస్తోంది. హిమాలయన్ రీజియన్‌లో 3 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని పాక్ ప్రచారం చేసింది. కాని ఎలాంటి ఫైటర్ జెట్స్ కూలిపోలేదు. భారత్ ఎలక్ట్రికల్ గ్రిడ్ కుప్పకూలిందని, 70 శాతం గ్రిడ్ పనిచేయడం లేదని పాక్ ప్రచారం చేస్తోంది. భారత్ ఎలక్ట్రిక్ గ్రిడ్ నిక్షేపంగా ఉంది. మహిళా పైలట్‌ను పట్టుకున్నామని పాక్ ప్రచారం చేసింది. కానీ భారత పైలట్లు అంతా క్షేమంగా ఉన్నారు.
కాశ్మీర్‌లో 3 ఫైటర్ జెట్స్ కూలిపోయాయని పాక్ చెప్పుకుంటోంది. పాత ఫొటోలతో పాకిస్తాన్ ఛీప్‌ పాలిట్రిక్స్ చేస్తోంది.

 

రాజస్థాన్, చండీగఢ్‌లో సైరన్ల మోత మోగుతోంది. దీంతో దాడులు జరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు రాజస్థాన్ చూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని ఆదేశించారు. బాల్కనీలకు దూరంగా ఉండాలని సూచించారు.