Published On:

PM Modi @plane Crash Spot: విమాన ప్రమాద స్థలానికి ప్రధాని.. మృతుల కుటుంబాల పరామర్శ

PM Modi @plane Crash Spot: విమాన ప్రమాద స్థలానికి ప్రధాని.. మృతుల కుటుంబాల పరామర్శ

PM Modi Visits Ahmedabad Plane Crash Spot: అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రమాదం జరిగిన మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా విమాన ప్రమాద వివరాలను అధికారుల వద్ద అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో గాయపడి సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోదీ పరామర్శించారు. అనంతరం స్టేట్ గెస్ట్ హౌస్ లో విమాన ప్రమాదంపై అధికారులతో ప్రధాని సమీక్ష నిర్వహించారు.

 

ప్రధాని వెంట కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను కుటుంబీకులకు త్వరగా అప్పగించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఘటనా స్థలం నుంచి ఎయిరిండియా ఆపరేషన్స్ సంస్థ టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ తో ప్రధాని మాట్లాడారు. కాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-7 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ మెడికల్ కాలేజీపై కూలిపోయింది. ప్రమాదంలో 229 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బంది మరణించారు. కాగా మెడికల్ కాలేజీపై పడటంతో మరో 24 మంది మెడికోలు ప్రాణాలు కోల్పోయారు.