Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు ఏపీ వాసుల మృతి
Karnataka: కర్ణాటకలోని హోస్కోట్ సమీపంలోని గొట్టిపుర గేట్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదంలో చనిపోయిన వారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వాసులుగా గుర్తించారు. కేశవరెడ్డి (44), తులసి (21), ప్రణతి (4), మూడు నెలల చిన్నారి చనిపోయారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా చనిపోయిన తులసి ఎస్ఆర్ పురం మండలం పుల్లూరు గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థినిగా గుర్తించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.