Operation Sindoor: 11మంది సైనికులు చనిపోయారన్న పాకిస్తాన్

Operation Sindoor: భారత్ చేసిన దాడుల్లో 11 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లు తెలిపారు పాక్ అధికారులు. ఈ విషయాన్ని ఎట్టకేలకు పాకిస్తాన్ అధికారికంగా ప్రకటించింది. ఆరుగురు సైనికులు, ఐదుగురు పాకిస్తాన్ ఎయిర్మెన్ మృతి చెందారని తెలిపారు. మృతుల్లో స్క్వాడ్రన్ లీడర్ ఉస్మాన్ యూసఫ్ ఉన్నారు. 121 మందికి గాయాలు అయినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. సోమవారం పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ ఆహ్మద్ షరీఫ్ చౌధరి మీడియా సమావేశం నిర్వహించి, భారత్ తో జరిగిన ఘర్షనలో వాయునేసకు చెందిన ఒక విమానం ధ్వంసమైందని చెప్పారు.
భారత వాయుసేనకు చెందిన ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ తాము పాక్ యుద్ధవిమానాలను కూల్చినట్లు చెప్పారు. అయితే శకలాలు పాకిస్తాన్ లో పడ్డాయన్నారు. కూలిన విమానం మిరాజ్ కావచ్చన్నారు.

pakistan 11 soldiers killed in operation sindoor1
ఆపరేషన్ సిందూర్లో తెర వెనక సంసిద్దంగా ఉన్న నేవీ కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా సముద్ర మార్గం ద్వారా పాకిస్తాన్ కదిలికలు గుర్తించి చేరవేయడమే కాకుండా.. వారిపై దాడి చేయటంలో నేవీ తన సత్తాను చాటింది. అంతేకాకుండా విశాఖలోని తూర్పు నావికాదళం సముద్ర తీరంలో కూడా నేవీ గస్తీ పెంచింది. శత్రు దేశం నుంచి విశాఖకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో కోస్ట్ గార్డ్ గస్తీ షిప్లను అప్రమత్తం చేసింది.
ఇండియా -పాకిస్తాన్ల మధ్య శనివారం కుదిరిన కాల్పుల ఒప్పందం గురించి యావత్ ప్రపంచం ముందు పాకిస్తాన్ నవ్వుల పాలయ్యింది. కాల్పుల ఒప్పందానికి అంగీకరించి.. వెంటనే గండికొట్టడం పాకిస్తాన్కే చెల్లింది. పాకిస్తాన్ను ప్రపంచంలోని ఏ దేశం నమ్మడం లేదు.

pakistan 11 soldiers killed in operation sindoor 2
ఇటీవల పాక్ అసెంబ్లీలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ.. ఈ యుద్ధంలో ముస్లిం దేశాలు కూడా మనకు మద్దతు ఇవ్వడం లేదు. ప్రపంచంలోని ఏ దేశం మనల్ని నమ్మడం లేదని వాపోయాడు. కేవలం ఒక్క తుర్కీ మాత్రం ఆపదలో ఆపన్నహస్తం అందిస్తోందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే ప్రపంచదేశాల ముందు పాకిస్తాన్ విలువ ఏ పాటిదో తేలికగా అర్ధం చేసుకోవచ్చు.