Published On:

Jyothi Malhotra data recovered: జ్యోతి మల్హోత్రా ఫోన్ల నుంచి 12 టెరా బైట్ల డేటా రికవరీ

Jyothi Malhotra data recovered: జ్యోతి మల్హోత్రా ఫోన్ల నుంచి 12 టెరా బైట్ల డేటా రికవరీ

Jyoti Malhotra’s 12 Terabytes of data Recovered: పాక్ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టు అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. తనతో టచ్‌లో పాకిస్థాన్ అధికారులు ఇంటర్‌సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ)తో కలిసి పనిచేస్తున్నారని జ్యోతికి తెలుసని దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. కానీ, ఆమె భయపడకుండా సంప్రదింపులు కొనసాగించారని పేర్కొన్నాయి. జ్యోతి ల్యాప్‌టాప్‌, ఫోన్‌లోని సమాచారం ఆధారంగా విషయాన్ని వెల్లడించాయి.

 

జ్యోతి ల్యాప్‌టాప్‌, ఫోన్లు స్వాధీనం..

జ్యోతి ల్యాప్‌టాప్‌, ఫోన్లు స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. జ్యోతి ల్యాప్‌టాప్‌, ఫోన్లలో తొలగించిన సమాచారాన్ని అధికారులు రికవరీ చేశారని, మొత్తం 12టెరాబైట్ల మేర ఉందని సమాచారం. కేసులో మరిన్ని ఆధారాల కోసం డేటాను స్కాన్‌ చేస్తున్నారు. జ్యోతి ఐఎస్‌ఐకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతున్నానని తెలిసే, కాంటాక్ట్ కొనసాగించారని సమాచారం ఆధారంగా ప్రాథమికంగా గుర్తించారు. జ్యోతి నలుగురు పాకిస్థాన్ ఐఎస్‌ఐ ఏజెంట్లతో మాట్లాడిందని, వారిలో డానిష్, అహ్సాన్‌, షాహిద్‌ ఉన్నారని వెల్లడించాయి. ఐఎస్‌ఐలో ఏజెంట్ల హోదాలు, ఉద్యోగాలు ఏంటో ధ్రువీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

 

జ్యోతికి పాకిస్థాన్‌లో ఆరు మంది వ్యక్తులు ఏకే 47 గన్‌లతో భద్రత కల్పించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. వారు ధరించిన జాకెట్లపై ‘నో ఫియర్‌’ అని రాసి ఉన్నట్లు కనిపించింది. 2023లో వీసా కోసం పాకిస్థాన్ హైకమిషన్‌కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్‌ పరిచయం అయ్యాడని వెల్లడించింది. పాకిస్థాన్ హైకమిషన్‌ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని ట్రాప్‌ చేసి వారిని డానిష్‌ గూఢచర్యానికి వాడుకొనేవాడని.. యూట్యూబర్‌ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా ఆమెను ట్రాప్‌ చేశాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకాలం పోలీస్‌ రిమాండ్‌లో ఉన్న జ్యోతిని కోర్టు సోమవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.

 

పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. కొన్ని వారాల వ్యవధిలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికిపైగా అరెస్టు అయిన విషయం తెలిసిందే. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

 

ఇవి కూడా చదవండి: