Jyoti Malhotra Security in Pak: యూట్యూబర్ జ్యోతికి పాకిస్తాన్ లో AK 47 భద్రత

Jyoti Malhotra Security in Pakistan: పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిన జ్యోతి మల్హోత్ర కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పాక్ లో జ్యోతికి అధికారికంగానే చాలా నెట్ వర్క్ ఉంది. ఏకంగా పాక్ ఐఎస్ఐ జ్యోతికి ఏకే 47తో కూడిన ఆరుగురు గన్ మెన్ లను ఇచ్చింది. పాకిస్తాన్ లోని అనార్ కలీ బజార్ లో జ్యోతి వీడియో షూట్ చేస్తుండగా ఆరుగురు గన్ మెన్ లు ఆవిడకు సెక్యురిటీగా ఉన్నారు.
ఓ స్కాట్ ల్యాండ్ కు చెందిన యూట్యూబర్ కూడా పాకిస్తాన్ లో వ్లాగ్ వీడియో షూట్ చేస్తున్నాడు. అనుకోకుండా జ్యోతి అతని వీడియోకు చిక్కింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. పాకిస్తాన్ మర్యాదలు ఎలావున్నాయని అతను జ్యోతిని అడిగితే చాలా అద్భుతంగా ఉన్నట్లు ఆవిడ సమాదానం చెప్పింది. అయితే అతను కాసేపటికే ఆవిడకు ఆరుగురు ఏకే47తో ఉన్న గన్ మెన్ లు కాపలా ఉన్నట్లు గమనించాడు. ఒక సాదారణ యూట్యూబర్ కు ఇంతటి ప్రొటక్షన్ ఎందుకని ప్రశ్నను లేవనెత్తాడు. పాకిస్తాన్ లో మహిళలు బయటకు వెళ్లినప్పుడు బుర్కాలతో ఉంటారు. అందుకు వ్యతిరేకంగా జ్యోతి స్లీవ్ లెస్ లో ఉంది. అదీను ఆవిడ విజిట్ చేసిన ప్లేస్ అత్యంత రద్దీగా ఉంది. అక్కడి ప్రజలు జ్యోతికి ఏమైనా ఆటంకం కలిగించకుండా చూసేందుకు స్థానిక ప్రభుత్వం గన్ మెన్ లను ఇచ్చిందా అని అనుమానాలు రేకెత్తుతున్నాయి.
చాలా ముఖ్యమైన వాళ్లకు ఏకే47తో కూడిన సెక్యురిటీని ఇస్తారు. మామూలు యూ ట్యూబర్ కు ఇంతటి సెక్యురిటీని ఇచ్చారంటేనే అర్థం అవుతోంది. భారత్ కు వ్యతిరేకంగా గూఢచర్యం చేసిన జ్యోతి పాకిస్తాన్ కు ఎంత ముఖ్యమోనని తెలుస్తోంది. స్కాంట్ ల్యాండ్ యూట్యూబర్ తో జ్యోతి మాట్లాడుతూ పాకిస్తాన్ ఎలా ఉందని అడుగుతుంది. బాగుంది ఐ లవ్ పాకిస్తాన్ అని అతడు అంటే చాలా గ్రేట్ అని ఆవిడ సమాదానం ఇచ్చింది. పాకిస్తాన్ మర్యాదలు తనకు చాలా నచ్చాయని చెబుతుంది.
పాకిస్తాన్ కు గూఢచర్యం చేసినట్లు జ్యోతి ఒప్పుకున్నట్లు సమాచారం. పాక్ హైకమిషన్ అధికారులతో తనకు దగ్గరి సంబంధాలున్నట్లు తెలిపింది. 2023లో వీసాకోసం పాక్ హైకమిషన్ కు వెళ్లినప్పుడు డానిష్ తొలిసారి పరిచయం అయ్యాడని ఆతర్వాత అతనితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అంగీకరించింది. జ్యోతి చేసిన గూఢచర్యం బయటకు అనుమానాలు రాకుండా, అనుకోకుండా జరిగినట్లు ఉండాలని స్కెచ్ వేసింది పాకిస్తాన్. అందులో భాగంగానే జ్యోతి తన వీడియోలను మామూలుగా షూట్ చేస్తూ వెళ్లింది. అదీనూ.. పహల్గాం దాడి రెండు రోజులు ముందనగా అక్కడే షూట్ చేసింది. దాంతో… అక్కడికి వస్తున్న పర్యాటకుల రద్దీని ఐఎస్ఐ కు తన వీడియోలతో తెలియజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తతం ఆవిడను అధికారులు విచారిస్తున్నారు.